MHBD: పట్టణ కేంద్రంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. MLA డా.భూక్యా మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు డా.ఉమమురళీనాయక్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమాన్ని నిర్వహించగా, వారు శ్రద్ధగా విన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ జ్యోతి-రమేష్, తదితరులున్నారు.