MNCL: కాసిపేట మండలం, కొండాపూర్ యాప వద్ద బీజేపీ నాయకులు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన మండలంలోని తొలి బీజేపీ వార్డు మెంబర్ ముత్యాల నవీన్ కుమార్ యాదవ్ ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఈ పరాభవ నామ సంవత్సరం అందరికి సుఖ సంతోషాలను కలిగించాలని ఆకాంక్షించారు.