SRD: ఆలయాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డిలోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.