GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మద్దిలేటి, జిల్లా అధికార ప్రతినిధి మైనర్ బాబు, వార్డు ఇంఛార్జ్ మాల గాయత్రి తదితరులు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.