PDPL: మంథని మాతాశిశు ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపరిండెంటెండ్ ప్రత్యేక చొరవతో గైనిక్ సేవలను పునః ప్రారంభించారు. గర్భిణీలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా డబ్బులు వృధా చేసుకోకుండా మంథని పరిసర ప్రాంతాల గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీధర్ కోరారు.
JGL: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ వెల్గటూర్ మండలంలో శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని పాశిగామ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను కలిసి వారి అవసరాలు, పాఠశాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టేలా అధికారులతో మాట్లాడతామన్నారు.
KMR: అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ, చలామణి చేసిన ముఠాకు చెందిన నిందితుడు లఖన్ కుమార్పై కామారెడ్డి జిల్లా పోలీసులు PD యాక్ట్ను అమలు చేశారు. కామారెడ్డి టౌన్ PSలో రెండు నకిలీ రూ. 500 నోట్ల వినియోగంపై కేసు నమోదు కాగా, దర్యాప్తులో భాగంగా తెలంగాణతో పాటు 5 రాష్ట్రాలలో ఆపరేషన్ నిర్వహించి, మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
KNR: జమ్మికుంట మార్కెటు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 659 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా, గరిష్ఠంగా రూ. 7,100, కనిష్ఠంగా రూ.6,200 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ. 6,400 పలికింది.
KNR: ముల్కనూర్ మోడల్ స్కూల్లో నెస్లే కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా నిర్మించిన బయో మాడ్యులర్ టాయిలెట్లను జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్, స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్, ఎంఈఓ పావని, నెస్లే కంపెనీ బాధ్యులు వసీం తదితరులు పాల్గొన్నారు.
MDK: హసన్ మీరాపుర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త దామరపల్లి మధుసూదన్ రెడ్డి తమ్ముడు మరణించారు. ఈ విషయం తెలిసి ఎంపీ రఘునందన్ రావు వారి కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం తెలిపారు. దివంగతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీతో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SRD: శబరిమల మహాపాదయాత్ర ముగించుకొని సంగారెడ్డికి వచ్చిన స్వాములకు పోతిరెడ్డిపల్లి హనుమాన్ దేవాలయం వద్ద శుక్రవారం ఘన స్వాగతం పలికారు. అయ్యప్ప ఆపద్బాంధవ సేవాసమితి ఆధ్వర్యంలో శబరిమలకు మహా పాదయాత్రగా వెళ్లిన 28 మంది స్వాములను శాలువాలతో పూలదండలతో సన్మానించారు. సంగారెడ్డి నుంచి తిరుమల కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమలకు పాదయాత్రగా వెళ్లినట్లు రాము తెలిపారు.
BHNG: రామన్నపేట పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని ఎస్ఐ నాగరాజు ఇవ్వాళ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట గ్రామంలో పేకాటను ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందింది. ఈ మేరకు వారిని పట్టుకొని వారి నుంచి 3 మొబైల్ ఫోన్లను, రూ.1,820 స్వాదినం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
KMM: రఘునాధపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ పర్యటించారు. వీ. వెంకటాయపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకంకు అనుసంధానంగా చేపట్టిన 33/11 కెవి సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ చీరలను గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేయాలని అన్నారు. ఎన్నికల షేడ్యూల్ లోపు చీరల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి అన్నారు.
HYD: రవాణా శాఖలో ఎన్ ఫోర్స్ మెంట్ను మరింత కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ కోసం కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్రస్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు. వ్యవసాయ సంబంధిత ట్రాక్టర్లు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్ ఫోర్స్ మెంట్ చేయాలన్నారు.
MDCL: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం శివారులో అప్పుల బాధతో మల్లేశ్, సంతోషి అనే దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త చనిపోయారు. కుమారుడు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
BDK: అశ్వాపురం మండలంలోని మిట్ట గూడెం గ్రామపంచాయతీ పాయం మంగయ్య గుంపు గ్రామంలో దుప్పి మాంసం విక్రయిస్తుండగా ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించి దుప్పి మాంసాన్ని విక్రయిస్తున్న సప్క వీరస్వామిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు శుక్రవారం వెల్లడించారు. అతని వద్ద నుంచి సుమారు 10 కిలోల మాంసం, దుప్పి తల, కాళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
KNR: చిగురుమామిడి మండలం సుందరగిరి జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్లో ఇందుర్తి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ పాఠశాల నుంచి సాయి వర్షిత, సుస్మిత, అక్షిత్లు జిల్లా స్థాయికి ఎంపిక కావడం విశేషం. మండలంలోని 12 పాఠశాలల నుంచి మూడు స్థానాలు ఈ పాఠశాలకే దక్కాయి.
NGKL: అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఈనెల 22, 23వ తేదీలలో జరుగుతుందని ఎమ్మెల్యే డా. వంశీ కృష్ణ తెలిపారు. 22న బల్మూరు (ఉ.10), లింగాల (మ. 2), అచ్చంపేట (సా.4) మండలాల్లో, 23న చారగొండ (ఉ.10), వంగూరు (మ.2), ఉప్పునుంతల (సా.4) మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద చీరల పంపిణీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
NLG: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు అవంతిపురం ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో డీ.టీ.ఆర్.బీ నల్గొండ, మిర్యాలగూడ రూరల్ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మిషన్ ట్రిబుల్ ఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.