• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఏరియా ఆసుపత్రిలో అందుబాటులోకి స్పెషలిస్ట్ వైద్యులు

MNCL: బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఉద్యోగుల కోసం మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నఅధికార ప్రతినిధి తిరుపతి బుధవారం తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి శుక్రవారం జనరల్ మెడిసిన్, ఆర్తోసర్జన్, సైకియాట్రిస్ట్, ప్రతి మంగళవారం గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ అందుబాటులో ఉంటారని సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

May 7, 2025 / 01:57 PM IST

కలెక్టరేట్లో మంత్రి పొన్నం సమీక్ష సమావేశం

SDPT: సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వేసవి కాలం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. 

May 7, 2025 / 01:54 PM IST

‘తూనీకాకు సేకరణకు ఎవరూ వెళ్ళవద్దు’

MNCL: తూనికాకు సేకరణకు అడవిలోకి వెళ్ళవద్దని జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామ ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ కోరారు. బుధవారం ఇందన్పల్లిలో ఆయన మాట్లాడుతూ.. కవ్వాల్ అభయారణ్యంలో తూనికాకు సేకరణ నిషేధించడం జరిగిందన్నారు. అలాగే అడవి నుండి ఇసుక, మొరం తరలింపును కూడా చేయవద్దని కోరారు. అడవి, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దీనికి అందరూ సహకరించాలన్నారు.

May 7, 2025 / 01:38 PM IST

‘వీరబ్రహ్మేంద్రస్వామి 332వ ఆరాధన మహోత్సవం’

HYD: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 332వ ఆరాధన మహోత్సవం సందర్భంగా హెచ్ బీ కాలనీ ప్రధాన కూడలిలో ఉన్న స్వామీ వారి విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఉన్నారు.

May 7, 2025 / 01:06 PM IST

కామ్రేడ్ శతజయంతి వార్షికోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ASF: MCPIU పార్టీ వ్యవస్థాపక నేత, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవం గోడపత్రులను ఆసిఫాబాద్ నియోజవర్గ సభ్యురాలు కోవా లక్ష్మి బుధవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. ఓంకార్ ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు తావు లేకుండా సామాన్య జీవితం గడిపారు. ప్రజా సేవ కోసమే జీవితం అంకితం చేసిన వ్యక్తి అని కొనియాడారు.

May 7, 2025 / 01:06 PM IST

ధాన్యం కొనుగోలుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి ‌

SRPT:  ధాన్యం కొనుగోళ్లల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద దాదాపు 40 రోజుల నుంచి రైతులు కాంటాల కోసం పడిగాపులు కాస్తున్నారని, అధికారులు వెంటనే ధాన్యాన్ని కాంటాలు వేయించాలన్నారు.

May 7, 2025 / 11:03 AM IST

అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు చేస్తే చర్యలు: ASP

ASF: అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ ASP చిత్తరంజన్ బుధవారం ప్రకటనలో హెచ్చరించారు. సామాన్యులతో పాటు అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల 15 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించి 10మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే దాడులు నిర్వహిస్తామన్నారు.

May 7, 2025 / 10:53 AM IST

కేదార్నాథ్ యాత్రలో అశ్వారావుపేట వాసి మృతి

KMM: కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన భద్రాద్రి జిల్లావాసి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. అశ్వారావుపేటకు చెందిన వెంకటేశ్వరరావు ఈనెల 1న ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లారు. సోమవారం రాత్రి కేదార్నాథ్ చేరుకుని అక్కడే నిద్రించారు. మంగళవారం దర్శనానికి వెళ్లడానికి సహచరులు నిద్రలేపగా లేవలేదు. వైద్యులకు చూపించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వారు చెప్పారు.

May 7, 2025 / 10:38 AM IST

స్థలాన్ని కాపాడాలని కలెక్టర్‌కు వినతి

MNCL: వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సదానందం ఆధ్వర్యంలో సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కన్నాల జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలో స్థలాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

May 7, 2025 / 10:32 AM IST

పశువుల నీటి తొట్టెను ప్రారంభించండి!

ADB: నార్నూర్ మండలం మాన్కపూర్ గ్రామంలోని గల పశువుల తొట్టె పిచ్చిమొక్కలతో దర్శనమిస్తుంది. రోజు అదే మార్గంలో ప్రయాణిస్తున్న అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. వేసవి కాలం నేపథ్యంలో పశువులు నీరు తాగే నీటి తొట్టెను ప్రారంభించకుంటే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులు నీటి తొట్టెను ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

May 7, 2025 / 09:41 AM IST

ఇందిరమ్మ గృహాలు అర్హులకే చెందాలి: కలెక్టర్

JGL: ఇందిరమ్మ గృహాలు అర్హులకే చెందేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం సమావేశం నిర్వహించారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ డీఈఈ, సంబంధిత అధికారులు ఉన్నారు.

May 7, 2025 / 08:13 AM IST

గంజాయి కేసులో యువకుడు అరెస్ట్

SRCL: గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్లకు చెందిన ఎండీ అహ్మద్ అనే వ్యక్తి 15 కేసుల్లో నిందితునిగా 5 కేసుల్లో పరారీగా ఉన్నాడు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న అహ్మద్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, రిమాండ్‌కు తరలించారు.

May 7, 2025 / 08:09 AM IST

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి దివ్య రూపం

WGL: శ్రీ భద్రకాళి దేవస్థానంలో నిర్వహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారికి పూజలు చేసి హారతినిచ్చారు. భద్రకాళి దేవస్థాన అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

May 7, 2025 / 08:08 AM IST

తూతూ మంత్రంగా పనులు

MLG: ఏటూరునాగారం మం. దొడ్ల-మల్యాల మధ్య జంపన్న వాగుపై సోమవారం చేపట్టిన మరమ్మతు పనులు ఒక్కరోజు గడవక ముందే మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షానికి చిన్నపాటి వరదకే రోడ్డు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కాగా, సక్రమంగా పనులు చేయకపోవడంతో మళ్లీ మట్టి కుంగి, భారీ గుంత ఏర్పడింది.

May 7, 2025 / 08:07 AM IST

బూజు పట్టిన బిస్కెట్స్.. కాలం చెల్లిన శనగపప్పు

WGL: వరంగల్ గొర్రెకుంటలోని బెల్ బ్రాండ్ ఇండస్ట్రియల్ కార, మిక్చర్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు, మంగళవారం సాయంత్రం టాస్క ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. బూజు పట్టిన బిస్కెట్స్, కాలం చెల్లిన శనగపప్పు వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2. 80లక్షల విలువైన శనగపప్పు, రూ. 50వేల హానికారక పదార్థాలను సీజ్ చేసినట్లు వివరించారు.

May 7, 2025 / 08:05 AM IST