• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈ నెల 25న నకిరేకల్‌కు టీపీసీసీ అధ్యక్షుడి రాక..!

NLG: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 25న నకిరేకల్ నియోజకవర్గానికి రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ తెలిపారు. నియోజకవర్గంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు కలిగిన కూలీలతో జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

January 20, 2026 / 08:10 AM IST

మహిళా సంఘాల అభివృద్ధికి వడ్డీ రహిత రుణాలు అందజేత

VKB: వికారాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రహిత రుణాలు అందజేశారు. అదనపు కలెక్టర్ సుదీర్ మాట్లాడుతూ.. ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహం కల్పిస్తోందని, రుణాలు సమర్థవంతంగా ఉపయోగిస్తే సామాజిక, ఆర్థిక స్వావలంబనకు సహాయపడుతాయని గుర్తు చేశారు.

January 20, 2026 / 08:09 AM IST

నేడు యాదాద్రిలో పర్యటించనున్న మంత్రి

BHNG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం సైదాపురంలో అంగన్వాడీ భవనాలు, సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట, ఆలేరులో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1:30కు మాటూరులో సబ్ స్టేషన్ పనులను ప్రారంభిస్తారని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

January 20, 2026 / 08:08 AM IST

టీచర్ల కాంప్లెక్స్ సమావేశాలువాయిదా

MBNR: రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని డీఈఓ కార్యాలయ ఏడీ అనురాధకు టీఎస్యూటీఎఫ్ (TSUTF) నాయకులు వినతిపత్రం ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు, వేడుకల అనంతరం సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు.

January 20, 2026 / 08:07 AM IST

నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుతున్న వరద

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగాల నుంచి మంగళవారం 930 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ ఏఈఈ సాకేత్ తెలిపారు. దీంతో పంటసాగు కోసం ప్రాజెక్టు ప్రధాన కాలువద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం14.673 టీఎంసీల నీటినిల్వ ఉన్నట్లు వివరించారు.

January 20, 2026 / 08:07 AM IST

‘విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ డబ్బులు చెల్లించాలి’

KNR: విశ్రాంత ఉద్యోగులకు జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ త్వరితగతిన చెల్లించాలని ఎస్టీయూ నాయకులు జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజును కోరారు. ఈమేరకు సోమవారం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్కుమార్ డీటీఓను కలిసి విన్నవించారు. అలాగే కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బంది డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలని వారు కోరారు.

January 20, 2026 / 08:06 AM IST

నిలిచిన ఫీజులు.. విద్యార్థుల అవస్థలు

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులు మూడేళ్లుగా ఆర్టీఎఫ్ (రీయింబర్స్మెంట్) ఫీజుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. అధికారులు స్పందించి వెంటనే స్కాలర్షిప్లు, కోర్సు ఫీజులను మంజూరు చేసి ఆదుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

January 20, 2026 / 08:06 AM IST

కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా

కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న 48 మందిలో పదమూడు మందికి గాయాలు కాగా వారిని దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

January 20, 2026 / 08:04 AM IST

ISRO సందర్శనకు 50 మంది విద్యార్థునులు ఎంపిక

KMR: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50మంది విద్యార్థినులు, 30 మంది ఉపాధ్యాయులు ఈ నెల 29న ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.

January 20, 2026 / 08:03 AM IST

వ్యవసాయ మార్కెట్‌లో వాణిజ్య పంటల ధరలు పెంపు

KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో వాణిజ్య పంటల ధరలు ఊపందుకున్నాయి. దేశీయంగా డిమాండ్ పెరగడంతో తేజ రకం మిర్చి క్వింటాలు గరిష్ఠంగా రూ.16,300 పలికింది. అటు పత్తి ధర కూడా వారం వ్యవధిలో రూ.1,000 పెరిగి క్వింటాలు రూ. 8,000కు చేరడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం 1రోజే సుమారు 30 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

January 20, 2026 / 08:02 AM IST

విద్యార్థి ప్రాజెక్టుకు ఎస్పీ ఫిదా..!

KMR: మాచారెడ్డి (M) మర్రితండాకు చెందిన అభిమన్యు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను గమనించి చలించిపోయాడు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ ప్రాజెక్టును సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్రను కలిసి తన ప్రాజెక్టును వివరించాడు. దీంతో ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

January 20, 2026 / 08:01 AM IST

వార్డు మారింది.. ఆశలు గల్లంతయ్యాయి

MNCL: మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమౌతుంది. దానికి అనుగుణంగానే జిల్లాలో వార్డుల వారీగా రిజర్వేషన్లును ప్రకటించిన విషయం విధితమే. వార్డుపై ఆశలు పెట్టుకున్న వారి ఆశలను లక్కీడిప్ ఆవిరి చేసింది. రిజర్వేషన్లు తారుమారు కావడంతో గెలిచే గుర్రం రెడీగా ఉన్నా పరిగెత్తే దారే రిజర్వ్ అయిందంటూ.. ఆశావాహులు ఆవేదన చెందుతున్నారు. వార్డు మారింది.. అదృష్టం గల్లంతైంది అంటూ వాపోతున్నారు.

January 20, 2026 / 07:56 AM IST

రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లింగంపేట వాసి

KMR: లింగంపేటకు చెందిన యాదగిరి పలువురు నిరుద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒకే ఏడాదిలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. గతంలో గ్రూప్-4 ఉద్యోగం సాధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూనే ఇటీవల విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లో జిల్లా ట్రెజరీ శాఖలో సీనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించి ఆర్డర్ కాపీ అందుకున్నారు.

January 20, 2026 / 07:56 AM IST

‘రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

MDK: భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనోహరాబాద్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి సచిన్ తెలిపారు. కూచారం క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు మంగళవారం కూచారం రైతు వేదికకు వచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచే అవకాశం ఉందన్నారు.

January 20, 2026 / 07:53 AM IST

సర్పంచ్‌ల శిక్షణను ప్రారంభించిన కలెక్టర్

KMR: పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు,కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణలో భాగంగా, జిల్లాలోని 532 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులకు 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శిక్షణ ఇవ్వబడుతుంది.

January 20, 2026 / 07:50 AM IST