KMM: దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాకు ₹500 బోనస్ ఇస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ బాబు అన్నారు. శుక్రవారం సత్తుపల్లి (మం) కిష్టారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కాంగ్రెస్ నేత దయానంద్తో కలిసి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
KMM: రాజ్యాంగాన్ని BJP ప్రభుత్వం అవహేళన చేస్తుందని DCC అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. శుక్రవారం ముదిగొండ (M) వెంకటాపురంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నహాక సమావేశం నిర్వహించారు. బీజేపీ పదేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా నియంతలా పాలిస్తుందని కార్పొరేషన్ ఛైర్మన్ నాగేశ్వరరావు విమర్శించారు.
KMM: కూసుమంచి మండల కేంద్రంలోని, ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారిని రామడుగు వాణి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు తగు సూచనలు చేశారు. దాన్యంలో మట్టి, తాలు లేకుండా తూర్పాలు పట్టాలని రైతులకు సూచించారు. సన్న రకాల ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందని తెలిపారు.
JN: ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలో ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 34 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ. 34.3 లక్షల విలువ గల చెక్కులను, అలాగే 32 మందికి CMRF చెక్కులు అందచేశారు.
MLG: జిల్లా న్యాయస్థానంలో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా ఎన్నికైన అడ్వకేట్ వేణుగోపాలచారి, వారి కార్యవర్గానికి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాదం ప్రవీణ్ శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బజారు శ్యాంప్రసాద్, ఉపాధ్యక్షులు మేకల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
ADB: బోథ్ మండలంలోని దన్నూరు గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. దన్నూరు గ్రామస్తులు మార్చి 30న తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్తో మాట్లాడి సమస్యను వివరించడం జరిగిందని అనిల్ జాదవ్ తెలిపారు. రైతుల సౌకర్యార్థం శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
WGL: కాకతీయ మెగా టెక్స్టైల్ కంపెనీ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన కుటుంబాలకు అధికారులు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సంగెం మండలంలో ఈరోజు 2వ బ్యాచ్ కుట్టు విషన్ శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శాంతి మండల సమాఖ్య కార్యాలయంలో HR సుచిత్ర ఈ తరగతుల ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి దొరుకుతుందన్నారు.
MNCL: అట్టడుగు వర్గాల్లోని ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు ఫూలే,సావిత్రి బాయి ఫూలే దంపతులని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు.
MNCL: సమాజానికి మార్గదర్శకులు మహాత్మ జ్యోతిబాపూలే అని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మధ్యాహ్నం ఖానాపూర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసే నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ASF: జిల్లాలో ఈ నెల 20 నుంచి ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.
KMM: అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో 5 GOVT ఉద్యోగాలు సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను CM రేవంత్ అభినందించారు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి, రక్తహీనతను లెక్కచేయకుండా విజయం సాధించాలన్న శిరీష పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. శిరీష భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని CM ఆకాంక్షించారు.
NGKL: తాడూరు మండలం గోవిందాయపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈ నెల 15 వరకు జరగనున్నాయని ఆలయ కార్యనిర్వాహకులు సూర్య ప్రకాష్ రావు తెలిపారు. 12న శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, 13న ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం, 14న సోమవారం బండ్ల ఊరేగింపు, 15న మంగళవారం ఉత్సవ మూర్తుల ఊరేగింపు, అమృత స్నానాలు నిర్వహించనున్నారు.
వనపర్తి: పెద్దమందడి గ్రామంలో గురువారం అప్పుల బాధతో జంగం చెన్నరాయుడు(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. జంగం చెన్నరాయుడు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాడని, అయితే వాటిని తీర్చలేక మనస్తాపానికి గురైన ఆయన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య జంగం జయమ్మ తెలిపిందని ఎస్సై శివకుమార్ చెప్పారు.
HYD: తడి, పొడి చెత్త, హానికర చెత్తగా వేరు చేసి స్వచ్ఛ ఆటోలోకి ఇవ్వాలని ప్రజలకు కమీషనర్ శరత్ చంద్ర అవగాహన కల్పించారు. ఈ రోజు బండ్లగూడ జాగీర్ నగర పాలక సంస్థ పరిధిలోని 2వ డివిజన్ భైరాగిగూడలో చెత్త సేకరణ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయడం నిషేధమని స్వచ్ఛ బండ్లగూడ జాగీర్ కొరకు సహకరించాలని తెలిపారు.
NLG: కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నేడు శుక్రవారం అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.