ASF: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఈనెల 13 నుంచి సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్, DEO దీపక్ తివారి శనివారం ప్రకటనలో తెలిపారు. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడాలని సూచించారు. జనవరి 9లోగా 100% సిలబస్ పూర్తి చేయాలన్నారు.
VKB: ధారూరు మండల పరిధిలోని రుద్రారం-నాగసమందర్ గ్రామాల మధ్య కోటపల్లి అలుగు వద్ద కొట్టుకుపోయిన రోడ్డుకు ఆర్ అండ్ బీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. భారీ వర్షాల కారణంగా కల్వర్టు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వెంటనే మట్టి నింపి తాత్కాలికంగా రోడ్డు వేయడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. దీంతో వాహనదారులు, గ్రామస్తులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
HYD: అమీర్పేటలో గల రెండు మొబైల్ దుకాణాలపై యాపిల్ కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దుకాణాలు యాపిల్ లోగో, ట్రేడ్ మార్క్లను అనుకరించి, నకిలీ iPhone, iPad, AirPods 2లను విక్రయించడం మేధో సంపత్తి హక్కుల (IPR) ఉల్లంఘనగా కంపెనీ పేర్కొంది. దీనిపై భారతీయ న్యాయ సంహిత (BNS), కాపీరైట్ చట్టం కింద SR నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MBNR: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్థానిక బ్రహ్మ మానసిక ఆరోగ్య శిబిరంలో జిల్లా న్యాయ సేవా సమితి సభ్యురాలు ఇందిర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషీ మానసికంగా ఒత్తిడితో జీవిస్తున్నాడని, మానసిక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లిదండ్రులతోపాటు పిల్లల మనోవిషయాలు తెలుసుకున్నారు.
VKB: వికారాబాద్ మండలం సర్పన్ పల్లి గ్రామస్తులు కీలక తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మకూడదని నిర్ణయించుకున్నారు. యువత మద్యం తాగి పాడైపోతున్నారని పేర్కొన్నారు. ఊరు బాగుంటేనే మనమందరం బాగుంటామన్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు, మద్యం షాపులు లేకుండా చూడాలని అధికారులకు తీర్మానం కాపీ అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు.
MNCL: ప్రభుత్వ నిర్ణయం కోసం లక్షెట్టిపేట తాలూకాతో పాటు ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు అన్ని పార్టీలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన ఆశావాహులను రిజర్వేషన్ నిరాశపరిచాయి. ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని హైకోర్టు కొట్టి వేసింది. దీంతో రిజర్వేషన్ల ద్వారా అవకాశం వచ్చిన వారు కూడా నిరాశకు లోనయ్యారు.
PDPL: సీజనల్ వ్యాపారాలు ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ హెచ్చరించారు. టపాకాయలు, ఉన్ని దుస్తుల విక్రయాలకు కూడా ఆన్లైన్లో తాత్కాలిక లైసెన్స్ పొందవచ్చని తెలిపారు. https://emunicipal.telangana.gov.in లో నమోదు చేసి బిల్లు చెల్లిస్తే లైసెన్స్ జారీ అవుతుందని వివరించారు.
సిద్దిపేట: నంగునూరు మండలంలో బీసీ సంఘాల పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. రాంపూర్ క్రాస్ రోడ్డు వద్ద జేపీ తండా వాసులు హన్మకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నంగునూరులో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
NGKL: అమ్రాబాద్ మండలంలోని వివిధ గ్రామాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ప్రతి కూలికి ఆధార్ ఈ కేవైసీ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయాలని ఏపీవో రఘుమూర్తి తెలిపారు. వెంకటేశ్వరబావి గ్రామంలో శనివారం ఆధార్ ఈ కేవైసీ ప్రక్రియను పరిశీలించి కూలీలకు తగు సూచనలు చేశారు. జిల్లా అధికారుల మేరకు రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
PDPL: కొత్త ఆర్టీసీ డిపో నిర్మాణం కోసం ప్రదేశంలో ఉన్న చెట్లు పర్యావరణ నియమావళి ప్రకారం నరికి తరలించేందుకు ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. టేకు, వేప, అశోక సహా 147 చెట్ల తొలగింపుకు దరఖాస్తులు అక్టోబర్ 16లోపు పెద్దపల్లి స్టేషన్ మేనేజర్ లేదా గోదావరిఖని డిపో సమర్పించాలన్నారు.
ADB: తాంసీ మండలంలోని ఆత్నంగూడ గ్రామస్తులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు అంశాలపై ఎమ్మెల్యేతో వారు చర్చించారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పనిచేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామస్తులకు సూచించారు.
SRD: సంగారెడ్డిలోని గిరిజన గురుకుల లా కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 13, 14న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఇంటర్ పాసైన, లాసెట్-2025లో అర్హత పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న ఏకైక గిరిజన (Boys) గురుకుల న్యాయ కళాశాల ఇదని పేర్కొన్నారు. ఇక్కడ చేరితే 5 ఏళ్ల లా కోర్సును ఉచితంగా పొందవచ్చని తెలిపారు.
SRPT: మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామనికి చెందిన ఆతుకూరి కోటమ్మ గతేడాది గుండెపోటుతో మరణించారు. అయితే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమాయోజన పథకం ద్వారా రూ. 2 లక్షల ఆర్థిక సాయం వచ్చినట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. అనంతరం కెనరా బ్యాంక్ రేవురు బ్రాంచ్ మేనేజర్ కోటమ్మ కుమారుడు ఆతుకూరి అశోక్కు అందించారు. తమకు సహకరించిన కెనరా బ్యాంక్ వారికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియాజేశారు.
WNP: పాలిటెక్నిక్ కళాశాలను 1959 అక్టోబర్ 11న విజయదశమి రోజున దేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ ప్రారంభించారు. అప్పటి రాష్ట్ర సీఎం నీలం సంజీవరెడ్డి ప్రారంభోత్సవ సభకు హాజరయ్యారు. అప్పట్లో కళాశాల 3 కోర్సులతో ప్రారంభమైంది. 07-07-1970 వరకు ప్రైవేటు నిర్వహణలో కళాశాల నడిచింది. 08-07-1970 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
MBNR: జడ్చర్ల మండలం కిష్టారం సమీపంలో పోతిరెడ్డి చెరువు అలుగు దాటే ప్రయత్నంలో గురువారం సాయంత్రం వృద్ధ దంపతులు గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా దంపతుల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన దంపతులతో భార్య తానేం రాములమ్మ మృదేహం శనివారం లభ్యమైంది. కాగా, భర్త ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.