HYD: ఉగాది నూతన సంవత్సరం వేళ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ కార్యాలయంలో పాల్గొన్న ఆయన, ఈ నూతన సంవత్సరం బీజేపీ బలాన్ని రెట్టింపు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలను ఉద్దేశించి, రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.
BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. చింతల వెంకట్ రెడ్డి జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు చింతల ప్రభాకర్ రెడ్డి శ్వేత సౌజన్యంతో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ నందు చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ మన్మధ కుమార్ హాజరయ్యారు.
BHPL: మహాముత్తారం మండలం ఉట్లపల్లి గ్రామంలో ఉపాధి పనుల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. బిసుల సునీత చెవికి పొరపాటున కొడవలి తగలడంతో తీవ్ర గాయమైంది. సహచర కూలీలు వెంటనే స్పందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉపాధి పనుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా పాటించాలని స్థానికులు కోరుతున్నారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా విశేష అభిషేకము నిర్వహించారు. స్వామి వారికి వివిధ పూజలు నిర్వహించారు.
KNR: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జమ్మికుంట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పట్టణ CI రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపూర్కు చెందిన కిషన్(30) కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఇవాళ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లెలి వివాహం, తండ్రి అనారోగ్య కారణాలతో ఈ అగాయిత్యం చేసుకున్నట్లు సమాచారం.
NLG: చిట్యాల(మం) పెద్దకాపర్తి, గుండ్రాంపల్లిల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ పండుగలా సాగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.
KMR: లింగంపేట్(మం) మంబాజీపేట్లో శుక్రవారం ఉగాది పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొండం నరసింహులు తెలిపారు. కుస్తీ పోటీలో విజేతగా గెలిచిన వారికి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కుస్తీ పోటీలకు పరిసర ప్రాంతాల పోటీదారులు పాల్గొనాలని కోరారు.
NRML: పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ముందు వెన్నెల డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులను సత్కరించి, సంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ మాట్లాడుతూ.. అకాడమి ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
MNCL: జన్నారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఉగాదిని పురస్కరించుకొని గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ అయ్యగారు దేవాలయం ఆవరణలో పంచాంగాన్ని చదివి వినిపించారు. పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారన్నారు.
NZB మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం AITUC, CITU, TUCI కార్మిక సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. 20న లేబర్ కమిషనర్కు, 23న జిల్లా కలెక్టర్ వినతిపత్రాలు ఇవ్వాలని, 24 నుంచి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలన్నారు. సమస్యను పరిష్కరించకుంటే 30 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని చెప్పుకొచ్చారు.
WGL: పర్వతగిరి మండలంలోని అన్నారం గ్రామ దర్గా చెరువు తూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. స్థానిక సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు. చెరువు తూమ్లు పూడుకుపోయి పంటలకు సాగునీరు అందకపోవడంతో ఇటీవల వాటికి మరమ్మతులు చేయించారు. ఈరోజు పూజలు నిర్వహించి, తిరిగి తూమ్ను ప్రారంభించారు.
PDPL: ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో గురువారం ఉగాది సందర్భంగా సర్పంచ్ భూక్య సంగీత సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రూ.10 లక్షలతో ప్రధాన రహదారి నుంచి మామిడిపల్లె వరకు రోడ్డు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగభూషణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
VKB: దౌల్తాబాద్లోని గోకాఫసల్వాద్ పయనీర్ పాఠశాల విద్యార్థి సబావత్ గౌతమ్ నవోదయ విద్యాలయ – 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ చాటారు. ఎల్.జి. తండాకు చెందిన గౌతమ్ 6వ తరగతి ప్రవేశానికి ఎంపికయ్యారు. 90/100 మార్కులతో జిల్లా స్థాయిలో 33వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు గౌతమ్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
BDK: ఉగాది పర్వదినం సందర్భంగా పాల్వంచ పట్టణంలో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మతల్లి దేవాలయంలో DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి కార్పొరేటర్ విమలాదేవి దంపతులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరంతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
KMM: కొత్త లింగాల కోట మైసమ్మ ఆలయ ఉగాది జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇట్టా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ సిబ్బంది వారిని ఘనంగా సత్కరించారు.