NRML: నర్సాపూర్ జి మండలం తురాటి సమీపంలో శనివారం సాయంత్రం బస్సు లారీ ఢీకొన్న ఘటన విషయం తెలిసిందే. కాగా తీవ్ర గాయాల పాలైన లారీ డ్రైవర్ను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MHBD: తొర్రూరు మండలం జమస్థాపురం రూపతండాలో శనివారం విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. రైతు భూక్య రవి పొలంలో ఎద్దులను మేపుతుండగా, ఒక ఎద్దు ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. జీవనాధారాన్ని కోల్పోయానని రైతు కన్నీటితో వాపోయారు. ప్రభుత్వం ఆయనను ఆదుకోవాలని రైతు కోరారు.
HNK: జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం రాత్రి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈనెల 27న జరగనున్న పార్టీ రజతోత్సవ వేడుకల సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన మహాసభను విజయవంతం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
BDK: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్ పాఠశాలలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో వంట మనిషి సరోజ వంట చేస్తుండగా, స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాఠశాల భవనం మరమ్మత్తుల లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
MNCL: కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో సర్వే నెంబర్ 248లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం శనివారం తెలిపారు. మండల MRO ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో ప్రవేశించి చెట్లను నరికి వేసినారని తెలిందన్నారు. దీంతో 7గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదర్శించారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో చేపట్టే రోడ్లు పలు అభివృద్ధి పనులపై చర్చించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
WGL: పర్వతగిరి మండలం గుడిబండ తండాలో ఇటీవల భూక్య రంగమ్మ (65) ఇటీవల తల్లిని పెద్ద కుమారుడు భూక్య రవి కొట్టడంతో ఆమె మృతి చెందిన విషయంపై శనివారం నిందితుడు రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం హెచ్చరిక జారీ చేస్తూ, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, అలా చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించిన వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొన్ని సందర్భాల్లో వారే మృత్యువాత పడుతున్నారని తెలిపారు. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
NZB: ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టిన మా భూమిలక్ష కిలోమీటర్ల రథయాత్ర విజయవంతం చేయాలని డీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ కోరారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈనెల 14న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం అవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బహుజన రాజ్య స్థాపన లక్ష్యంగా యాత్ర కొనసాగుతుందన్నారు.
NZB: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నవీపేట్ మండలం నాగేపూర్, నిజాంపూర్, నాలేశ్వర్, నవీ పేట్లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శనివారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం ధాన్యం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.
MNCL: మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం జన్నారం కేంద్రంలోని పైడిపల్లి గార్డెన్లో మహనీయుల జయంతి ఉత్సవాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు.
ఖమ్మం: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు శనివారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో భేటీ అయ్యారు. జిల్లాలోని పలు ఆలయాల్లో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలను రాయల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం పై నియోజకవర్గ, మండల స్థాయి సన్నహాక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు.
MBNR: అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించి, వరి ధాన్యం సేకరణను పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో సింగిల్ విండో డైరెక్టర్లు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
KMM: మధిర రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శనివారం రెండో రోజుకు చేరుకుంది. రైల్వే గేటును శాశ్వతంగా మూసి వేయడం వల్ల మధిరలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సిపిఎం నాయకులు బెజవాడ రవి అన్నారు. ప్రత్యాయ్నాయ మార్గం చూపకుండా ఎలా గేటును మూసివేస్తారని ప్రశ్నించారు.
SDPT: వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఇన్ పుట్ సబ్సిడీ అందించి రైతులను ఆదుకోవాలని, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. శనివారం నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు.