HYD: GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ పత్రాలను కమిషనర్ కార్యాలయంలో మంగళవారం పరిశీలించనున్నారు. పోటీకి అర్హులుగా నిలిచేవారు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుంది. అన్ని నామినేషన్లు అర్హత పొంది, ఎవరూ ఉపసంహరించుకోని పక్షంలో 25వ తేదీన పోలింగ్ జరగనుంది.
HYD: మూసాపేట్ ఆంజనేయ నగర్కు చెందిన సోమా ప్రభాకర్ 14 ఏళ్ల క్రితం తనకు దొరికిన కుక్క పిల్లను చేరదీసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తనకు ఆడపిల్లలు లేకపోవడంతో ఆ శునకానికి కుట్టి అని పేరు పెట్టి కుటుంబ సభ్యుడిగా చూసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో కుక్కపిల్ల సోమవారం మృతి చెందింది. దీంతో వారు శోకసంద్రంలో మునిగారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
HYD: శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ను నిలిపివేశారు.
BHNG: మోత్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న షటిల్ టోర్నమెంట్స్ క్రీడా పోటీలను ఎస్సై డీ.నాగరాజు, ఎంఈఓ తీపి రెడ్డి గోపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఎస్సై, ఎంఈఓ మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం, లభిస్తుందని యువకులు క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.
మంచిర్యాల: పెద్దంపేట రైల్వే స్టేషన్లో రైలు కింద పడి సోమవారం గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మృతురాలి వయస్సు 50-55 సంవత్సరాలు ఉండగా, ఎడమ చేతిపై జనగామ లక్ష్మి అని పచ్చబొట్టు ఉన్నట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఈ నంబర్లకు 8328512176, 9490871784 సమాచారం ఇవ్వాలని సూచించారు.
SRD: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జైపాల్ రెడ్డి, నాగభూషణం పాల్గొన్నారు.
NRML: ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్నినిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా తెలియజేయాలని సూచించారు.
ADB: మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నేరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు వారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందించారు. మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సంతోష్ సింగ్ తదితరులున్నారు.
SRD: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రీవెన్స్ హాలులో డీఆర్ఓ పద్మజా రాణి, డీపీఓ సాయిబాబా ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న అధికారులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
SRD: కోహిర్ మండలం గోటియర్ పల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అర్జున్ పవన్, శంకర్ కోహిర్ మండలంలోని ఓ విందుకు వెళ్లారు. సిద్దాపూర్ తాండాలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి శంకర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
KMR: రాజంపేట మండల కేంద్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బల్వంత్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ అశోక్, మాజీ రైతు బందు అధ్యక్షులు మోహన్ రెడ్డి, ఎస్టీ సెల్ గణేష్ నాయక్, మండల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
NRML: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈవో పరశురాం సూచించారు. తానూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షలను ఆయన పరిశీలించారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
BHNG: చౌటుప్పల్ మండలం రెడ్డి బావి గ్రామ సమీపంలో అక్రమంగా 9 ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పశువులను, వాహనాన్ని స్థానిక పోలీసులకు అప్ప చెప్పారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. ఈ ఘటనపై వాహనం సీజ్ చేసి డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
KMR: యువజన కాంగ్రెస్ జిల్లా,నియోజకవర్గ అధ్యక్షులకు 3రోజులు శంషాబాద్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువ క్రాంతి బునియాద్’కు ఢిల్లీ నుంచి వచ్చిన బృందం నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. శిక్షణలో KMR జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జుక్కల్, బాన్సువాడ అధ్యక్షులు ఇమ్రోజ్, మన్సూర్ పాల్గొన్నారు.
JGL: జిల్లాలో పెద్దగట్టు జాతర అంగరంగవైభవంగా ప్రారంభం అయింది. జాతరలో నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరకు రూ.5 కోట్లు కేటాయించామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.