MNCL: జన్నారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఉగాదిని పురస్కరించుకొని గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ అయ్యగారు దేవాలయం ఆవరణలో పంచాంగాన్ని చదివి వినిపించారు. పరాభవ నామ సంవత్సరంలో వర్షాలు బాగా పడతాయని, పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో జీవిస్తారన్నారు.