NLG: చిట్యాల(మం) పెద్దకాపర్తి, గుండ్రాంపల్లిల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఇవాళ పండుగలా సాగింది. ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.