KMM: కొత్త లింగాల కోట మైసమ్మ ఆలయ ఉగాది జాతర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇట్టా శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ సిబ్బంది వారిని ఘనంగా సత్కరించారు.