PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ రూ. 2,00,116 విరాళంగా అందజేశారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ వీర్ పాల్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద నాయకులు గంగపుత్రులకు అందించారు. గతంలో సైతం రూ.1,00,000 అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి గంగపుత్రులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో AMC, VC లింగయ్య, నాయకులు పాల్గొన్నారు.