BDK: పాల్వంచ మండలం జగన్నాథపురం పెద్దమ్మ తల్లి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహించారు. గత 162 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.42,84,648 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రజనీకుమారి, డివిజన్ పరిశీలకులు బేల్సింగ్ సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ లెక్కింపు ప్రక్రియ జరిగిందని అధికారులు తెలిపారు.