TG: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకానికి కావాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని లబ్ధిదారుల తరపున ప్రభుత్వమే నేరుగా బీమా కంపెనీలకు చెల్లిస్తుంది.