NRML: ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని భైంసా ఇంఛార్జ్ ఏఎస్పీ సాయికిరణ్ హెచ్చరించారు. భైంసాలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను భైంసా టౌన్ సీఐతో కలిసి ఆయన తనిఖీలు చేపట్టారు. అనంతరం అక్రమ ఇసుక నిల్వలపై సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు.