SRD: పటాన్చెరు నియోజకవర్గం వెలిమల గ్రామంలో బీఆర్ఎస్ నేత రాజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు కానుకలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, ఉపవాస దీక్షలు విరమించారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.