SDPT: బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతన ముఖద్వారం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి స్వంత నిధులతో నిర్మించిన ఈ ద్వారాన్ని సర్పంచ్ ముక్కీస కవిత పరిశీలించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హరీశ్, కార్యదర్శి అనూష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.