MNCL: జైపూర్ మండలంలోని కిష్టపూర్ గ్రామంలో శుక్రవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై శంకర్ మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్నారు. వాటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనం గడపాలని సూచించారు.