AP: ఏపీకి చెందిన వ్యక్తి చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ‘సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్’ అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. అన్మిష్ వర్మ ఈ సాహసయాత్రను కేవలం 92 రోజుల 4 గంటల 45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశాడు.