MNCL: జనగణన- 2027 తొలి విడతలో భాగంగా ఇళ్ల గణన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం నస్పూర్ కలెక్టరేట్లో జనగణన ప్రక్రియ, యాప్ నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి యాప్ ద్వారా ఖచ్చితంగా జనగణన చేపట్టాలని ఆయన సూచించారు.