PDPL: రామగుండంలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ ఉద్యోగులకు ఉగాది పచ్చడి అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో క్వాలిటీ జనరల్ మేనేజర్ సుజోయ్ మజుందార్, ఏజీఎం నాగేశ్వర్ రావు, చిలుక శ్రీనివాస్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.