యాదాద్రి: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లింగారెడ్డిగూడెం వాస్తవ్యులైన IPS అధికారిణి సురకంటి శేషాద్రి రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.