JGL: పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.