GNTR: 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఉండవల్లిలో మంత్రుల ఉప సంఘం సమావేశం జరిగింది. కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న 787 కంపెనీలను కూడా ట్రాక్ చేస్తామని పేర్కొన్నారు.