SDPT: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఉగాది పండుగ ప్రతీక అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అనునిత్యం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.