JN: జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అస్థిర రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుందని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సోమయ్య సుగుణమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.