SRD: ఖేడ్ మండలం మద్వార్ తండా గ్రామపంచాయతీలో కొత్తగా సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ సర్దార్, గ్రామస్తులు గురువారం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి కృషితో గ్రామానికి MGNREGS పథకం కింద రూ. 5 లక్షల నిధులు మంజూరయ్యాయని సర్పంచ్ తెలిపారు. దేవసోత్ కిషన్ నాయక్ ఇంటి నుంచి లాల్ సింగ్ ఇంటి వరకు సీసీ రోడ్డు వేస్తున్నట్లు చెప్పారు. ఇందులో వార్డు సభ్యులు ఉన్నారు.