JN: చిలుపూరు మండలం చిన్న పెండ్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఫర్టిలైజర్ షాప్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
HYD: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునిగాయి. వేముకుంటలోని పలు ఇళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో టీజీ పీఈసెట్ గురువారం ఈవెంట్స్ రెండో రోజు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా విద్యా మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ హాజరయ్యారు. ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్ గాల్లో కాల్పులు జరిపి రన్నింగ్ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.
KNR: చొప్పదండి సాయిబాబా మందిరంలో పౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ఆలయ కమిటీ నిర్వహించింది. భక్తులు దర్శనానికి పోటెత్తారు. ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ హన్మంతరెడ్డి, నిర్వాహకులు లింగన్న, రాము, లక్ష్మణ్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MNCL: రెవెన్యూ సదస్సులతో రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. గురువారం జన్నారంలోని ఫోన్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు రైతుల నుండి వారు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పరుగులు పాల్గొన్నారు.
KMM: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన అందిస్తుందని మండల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ముదిగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునః ప్రారంభోత్సవంలో స్పెషల్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడారు. తాను చదువుకునే రోజుల్లో అనేక ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
HNK: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో సీఐగా గురువారం ఏం రంజిత్ కుమార్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సత్యనారాయణ రెడ్డిని విఆర్కు అటాచ్ చేయగా వీఆర్లో ఉన్న రంజిత్ కుమార్కి సీపీ సన్ ప్రీత్ సింగ్ సుబేదారి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. నూతన సీఐని పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందించారు
BHPL: భూపాలపల్లిలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో బుధవారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జనంసాక్షి ఎడిటర్ రహమాన్పై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వ్యతిరేక కవరేజ్కు ప్రతీకారంగా అక్రమ కేసు పెట్టినట్లు ఆరోపించారు. ప్రశ్నించే గొంతును అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
భూపాలపల్లి: భూపాలపల్లిలో ఎంఎస్ఓ సంఘం నేతలు బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వేషాల రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ.. కేబుల్ ఆపరేటర్లపై టీఎస్ఎన్పీడీసీఎల్ విధించిన పోల్ టాక్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో నడుస్తున్న కేబుల్ పరిశ్రమకు ఇది అదనపు భారం అని తెలిపారు. ఆపరేటర్లు బోట్ల రాజు, సురేష్, సతీష్ తదితరులున్నారు.
WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో కాంగ్రెస్ నేతలు బుధవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులున్నారు.
MNCL: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ చార్జీలను, బస్ పాస్ చార్జీలు తగ్గించాలని కోరుతూ MCPIU పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి RDO కార్యాలయంలో SO గురువయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. నాయకులు రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్ మాట్లాడుతూ.. చార్జీలు పెంచి ఆర్థిక భారంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
MBNR: కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేధ్ను మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నారాయణపేటలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై చర్చించినట్లు వెల్లడించారు. గత BRS ప్రభుత్వ అసమర్థత మూలంగా సైనిక్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ ఆగిపోయిన విషయాన్ని గుర్తు చేసినట్టు తెలిపారు.
SRCL: రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని, బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేందర్ సూచించారు. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో వికసిత్ కృషి సంకల్ఫ్ అభియాన్, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో నూతన పద్ధతులు వాడాలన్నారు.
ASF: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి తిరుపతి పేర్కొన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలంలోని చొర్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమిపూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని ఉపసర్పంచి నారాయణ అన్నారు.
HYD: నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ను జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా బహుళ అంతస్తుల్లో మాల్ను నిర్వహిస్తున్న యాజమాన్యంపై సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు చేసి మాల్ను మూసేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా మాల్ను నిర్వహించడం సరికాదని అధికారులు హెచ్చరించారు.