• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కరస్పాండెంట్ కు విద్యావంతుల సన్మానం

SRD: ఖేడ్ పట్టణంలోని గత మూడు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సు ప్రదర్శనలు గురువారం ముగిసాయి. 53వ వైజ్ఞానిక సదస్సుకు సహకరించిన స్కూల్ కరస్పాండెంట్ శరత్ కుమార్‌ను స్థానిక విద్యావంతులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజు, మధుసూదన్, శ్రీకాంత్, శివశంకర్, పాండురంగారెడ్డి, జైపాల్ ,గోపాల్, గోవర్ధన్,రాజశేఖర్ ఉన్నారు.

November 20, 2025 / 06:28 PM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు

MBNR: బాలానగర్ మండల పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రమాదాలు జరిగే స్థలాలను మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గురువారం సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా సూచిక బోర్డులు, స్పీడ్ లిమిట్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్, ఎస్సైలు గోపాల్ రెడ్డి, సుజ్ఞానం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

November 20, 2025 / 06:22 PM IST

గోవు ఆకృతిలో దీపోత్సవం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక మాసం పురస్కరించుకొని నిత్య దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గురువారం రాత్రి కార్తీక బహుళ అమావాస్య పురస్కరించుకొని మన సాంస్కృతి పరంగా గావో విశ్వస్య మాతర: అని అంటారు కాబట్టి గోశాల వద్ద గోవు ఆకారంలో దీపోత్సవం నిర్వహించారు.

November 20, 2025 / 06:21 PM IST

జిల్లా కలెక్టర్‌కు జర్నలిస్టుల అభినందనలు

ADB: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇటీవల స్థాయి పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాను జర్నలిస్టులు అభినందించారు. గురువారం ఆదిలాబాద్‌లో కలెక్టర్‌ను కలిసిన జర్నలిస్టులు శాలువా కప్పి మెమొంటోతో సత్కరించారు. జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం జిల్లా అభివృద్ధికి మరింత దోహదం చేస్తాయని ఆకాంక్షించారు.

November 20, 2025 / 06:19 PM IST

‘బాలల హక్కులను కాపాడాలి’

MDK: బాలల హక్కులను కాపాడాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉప్పలయ్య పేర్కొన్నారు. మెదక్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలలందరూ తమకు ప్రసాదించిన హక్కులైన జీవన హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామ్యకు అప్పు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

November 20, 2025 / 06:18 PM IST

‘ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలి’

MNCL: జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట సాగుతో కలిగే లబ్ధిపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో 2 వేల ఎకరాలో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438 ఎకరాలలో సాగవుతోందని తెలిపారు.

November 20, 2025 / 06:18 PM IST

‘కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలి’

WNP: వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీజీపీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా పోలీస్ శాఖ పారదర్శకంగా సేవలు అందించాలన్నారు.

November 20, 2025 / 06:17 PM IST

రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు పోలీసులు వినూత్న చర్యలు

KNR: తిమ్మాపూర్‌లో రాజీవ్ రహదారిపై తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్ల వద్ద మనుషులను పోలిన పోలీస్ బొమ్మలను గురువారం ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ప్రతి చౌరస్తా వద్ద భారీ బారికేడ్లను అమర్చారు. ఈ సరికొత్త ఆలోచనలతో ప్రమాదాలను తగ్గించవచ్చని ఎల్ఎండి ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

November 20, 2025 / 06:15 PM IST

చైన్ సిస్టమ్‌లో నిందితుడి అరెస్ట్: సీపీ

NZB: కోటగల్లీలోని కెనరా బ్యాంకు పక్కన ఉన్న BMB మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ ద్వారా మోసగిస్తున్న చంద్రశేఖర ప్రసాద్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు NZB సీపీ సాయి చైతన్య తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తోకల బక్కన్న అనే బాధితుడి ఫిర్యాదు మేరకు BMB పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితుడు సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిపారు.

November 20, 2025 / 06:14 PM IST

‘కుల, ఆదాయం ధృవపత్రాల జారీ వేగవంతం చేయాలి’

ASF: కాగజ్‌నగర్ మండలంలో కుల, నివాస, ఆదాయం ధృవపత్రాల జారీ వేగవంతం చేయాలని RTI సభ్యులు కోరారు. ఈ మేరకు గురువారం MRO మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ధృవపత్రాల జారీకి ఆలస్యం కావడంతో విద్యార్థులు, నిరుద్యోగులు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆఫీస్‌లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

November 20, 2025 / 06:14 PM IST

అంగన్వాడీ చిన్నారులకు భోజన ప్లేట్లు అందజేత

KMM: ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామం అంగన్వాడీ కేంద్రం-4లోని 20 మంది చిన్నారులకు కాంగ్రెస్ నేత అయోధ్య తన అన్నయ్య వెంకటేశ్వర్లు జ్ఞాపకార్ధంగా ఉచితంగా భోజన ప్లేట్లను అందజేశారు. ఆయన చేసిన ఈ మంచి పనిని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయ, గ్రామస్థులు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

November 20, 2025 / 06:13 PM IST

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు’

JGL: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌ఛాార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలను పట్టణంలోని సినారె కళాభవన్లో గురువారం అందజేశారు.

November 20, 2025 / 06:09 PM IST

‘KTRపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదు’

RR: మాజీమంత్రి కేటీఆర్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికాదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అంశాలపై ప్రశ్నించే గొంతులను సీఎం రేవంత్ రెడ్డి నొక్కే ప్రయత్నం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఫార్ములా ఈ కేసు ప్రభుత్వ కక్ష పూరిత ధోరణికి ఉదాహరణ అన్నారు. అక్రమ కేసులతో నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరన్నారు.

November 20, 2025 / 06:07 PM IST

నిధుల మంజూరు కోసం ఎంపీకి వినతి

SDPT: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి నిధుల మంజూరు కోసం ప్రతిపాదనల వినతిపత్రం అందజేశారు.

November 20, 2025 / 06:05 PM IST

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: సీపీ

WGL: డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గురువారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. మత్తు మహమ్మారిని అణచివేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా పోరాటం చేయాలని ఆయన కోరారు. డ్రగ్స్‌ వినియోగం, విక్రయం నియంత్రణకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు.

November 20, 2025 / 06:04 PM IST