• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలి’

ADB: ఈనెల 23, 24 తేదీలలో జరిగే ప్రాథమిక పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలబోజు గోపికృష్ణ కోరారు. ఈ విషయమై కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. 23వ తారీకు వసంత పంచమి, 25న ఆదివారం కావున పాఠశాలలో ఆటల పోటీలు, జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం లేదని విన్నవించారు.

January 20, 2026 / 10:33 AM IST

సారపాకలో ఇసుక దందాకు చెక్

BDK: సారపాకలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాలతో గోదావరి నదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా తహసీల్దార్ చర్యలు చేపట్టారు. నదికి వెళ్లే మార్గాల్లో పోల్స్ ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేశారు. పోలీస్ నిఘా పెంచి ఇసుక దందాకు చెక్ పెడుతున్నారు. ప్రజలే పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తున్నారు.

January 20, 2026 / 10:28 AM IST

నాశరకం ఎరువులు విక్రయించారని రైతుల ఆగ్రహం

SRCL: ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలోని ఫెర్జిలైజర్, ఫెస్టిసైడ్, సీడ్స్ దుకాణ నిర్వాహకుడు నాసిరకం ఎరువులను విక్రయించారని, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి రూ. 800 చొప్పున ఇస్తామని దుకాణదారుడు చెప్పడంతో రైతులు శాంతించారు. మండల వ్యవసాయాధికారిణి అనూష చేరుకుని దుకాణాన్ని, రికార్డులను తనిఖీ చేశారు.

January 20, 2026 / 10:26 AM IST

పల్లే ఆంజనేయ స్వామి ఆలయంలో శివనామ స్మరణ

GDWL: శాంతినగర్ పట్టణంలోని పల్లే ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మంగళవారం శివనామ స్మరణతో మారుమోగింది. స్వాములు వేకువజామునే విశేష అభిషేకాలు, లింగాష్టక పఠనం నిర్వహించారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, పూజల అనంతరం భక్తులకు ప్రసాదం వితరణ చేశారు. శ్రీనివాసులు, కురవ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

January 20, 2026 / 10:24 AM IST

నేడు ఉమ్మడి జిల్లాకు రానున్న TPCC చీఫ్

NLG: TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం ఉమ్మడి NZB జిల్లాకు రానున్నారు. ఉదయం 11 గంటలకు HYD MLA Qrts నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 1.30 గంటలకు KMR చేరుకుంటారు. 2 గంటలకు అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 4 గంటలకు NZB బయలుదేరుతారు. రాత్రి NZBలో బస చేసి బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.

January 20, 2026 / 10:22 AM IST

మేడారం జాతరలో ‘మేడారం 2.0’తో అత్యాధునిక భద్రత

MLG: మేడారం మహా జాతరలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ‘మేడారం 2.0’ కాన్సెప్ట్‌ను అమలు చేస్తోంది. AI ఆధారిత ‘టీజీ-క్విస్ట్’ డ్రోన్లు, హీలియం బెలూన్లపై అమర్చిన హై-రిజల్యూషన్ కెమెరాల ద్వారా జాతర ప్రాంగణంలో నిరంతర నిఘా ఉంచనున్నారు. తప్పిపోయిన భక్తులను వేగంగా గుర్తించేందుకు VI సహకారంతో ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

January 20, 2026 / 10:21 AM IST

నిర్మల్‌లో బీఆర్ఎస్ నూతన సంవత్సరం క్యాలెండర్ల ఆవిష్కరణ

నిర్మల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ ముద్రించిన క్యాలెండర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రజల మధ్య మరింత బలంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

January 20, 2026 / 10:21 AM IST

వైభవంగా పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

NGKL: ఊరుకొండపేటలోని శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్వహించిన రథోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఊర్కోకొండ ఆధ్యాత్మికక్షేత్రంలో ఉత్సవాలు ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు.

January 20, 2026 / 10:21 AM IST

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభ్యుదయానికి పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ‘ఇందిరా మహిళా శక్తి’ సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు రూ. 1,03,67,848 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబం, సమాజం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.

January 20, 2026 / 10:21 AM IST

జిల్లాలో చలి పంజా.. రాజాపూర్లో 11.8 డిగ్రీలు

MBNR: ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాజాపూర్ మండలంలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జడ్చర్లలో 12.1, కొత్తపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో రాత్రివేళల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

January 20, 2026 / 10:20 AM IST

రుప్లతండాతో తాగునీటి కష్టాలు

MDK: శివంపేట్ మండలం రూప్లతండాలో తాగునీటి సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. కోట్ల రూపాయలతో అమలైన మిషన్ భగీరథ పథకం ఉన్నా గ్రామానికి మాత్రం చుక్క నీరు అందడం లేదు. నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మిషన్ భగీరథ నీటిని గ్రామానికి అందించి ఈ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

January 20, 2026 / 10:16 AM IST

మహిళా సంఘాలకు ఎమ్మెల్యే వడ్డీ రహిత రుణాలు అందజేత

VKB: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 23 లక్షల వడ్డీ రహిత రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి పాల్గొన్నారు. ఆడబిడ్డలు ఆశీర్వదిస్తేనే ప్రభుత్వం శ్రేయస్సుగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

January 20, 2026 / 10:12 AM IST

కిక్కిరిసిన అంజన్న క్షేత్రం

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సమ్మక్క, సారక్క జాతర సమీపిస్తున్నందున భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేకువజాము నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించి, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారి సేవలో తరిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అదనపు ప్రసాద కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.

January 20, 2026 / 10:08 AM IST

జనసేన జూలూరుపాడు మండల అధ్యక్షుడిగా రమేష్ నియామకం

BDK: జూలూరుపాడు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా మండలానికి చెందిన ఉసికల రమేష్‌ను నియమిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. తన ఎంపికకు సహకరించిన జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

January 20, 2026 / 10:05 AM IST

అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదు

RR: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు, వారి వైఫల్యాలను బయటపెడుతున్నందుకు మాజీ మంత్రి హరీష్ రావు పై కక్ష కట్టింది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం అభ్యంతరకరమని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదని తెలిపారు.

January 20, 2026 / 10:02 AM IST