• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

BDK: మణుగూరు మండలం చిక్కుడు గుంట గ్రామంలో కమ్మసిచ్చు సురేష్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం స్థానికులు వెల్లడించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. యువకుడు మృతి చెందడంలో గ్రామంలో విషాద ఛాయలు అరుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలకు హద్దు లేకుండా పోయింది.

May 9, 2025 / 10:14 AM IST

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించండి: BSP

BDK: సుజాతనగర్ BSP నాయకుల ఆధ్వర్యంలో ఎంపీడీవో‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా చూడాలని ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే కేటాయించాలని తెలిపారు. డబ్బున్న వాళ్లకు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్లకు కేటాయించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో BSP సుజాతనగర్ మండల కమిటీ పాల్గొన్నారు.

May 9, 2025 / 10:03 AM IST

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NGKL: తాడూర్ మండలం తుమ్మలసుగుర్‌లో పిండిగిర్ని నిర్వహిస్తున్న తల్లి జయమ్మ, కుమారుడు శ్రీకాంత్ ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇవాళ బాదిత కుటుంబాన్ని పరామర్శించి రూ.15 వేలు ఆర్థికసహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం జయమ్మ, శ్రీకాంత్ చిత్రపటాలకు ఆయన నివాళులు అర్పించారు.

May 9, 2025 / 10:01 AM IST

గోరింట గ్రామం నుంచి 42 మంది జవాన్లు డ్యూటీకి

NGKL: తిమ్మాజిపేట మండలంలోని గోరింట గ్రామం నుంచి అత్యధికంగా 42 మంది జవాన్లు విధుల్లో ఉన్నారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత వీరిలో కొందరు సెలవులపై గ్రామానికి వచ్చినప్పటికీ, పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అధికారులు తిరిగి విధులకు హాజరుకావాలని ఆదేశించారు.

May 9, 2025 / 09:51 AM IST

వైరా ఏసీపీగా సారంగపాణి నియామకం

KMM: వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్‌ను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయన స్థానంలో హైదరాబాద్ పోలీస్ అకాడమీలో పనిచేస్తున్న ఎస్.సారంగపాణిని నియమించారు. సుమారు మూడేళ్ల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించిన రెహమాన్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు.

May 9, 2025 / 09:50 AM IST

లైసెన్స్ సర్వేయర్లు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

GDWL: లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తునట్లు గురువారం సాయంత్ర జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ తెలిపారు. ఈనెల 17వ తేదీ వరకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ (గణితశాస్త్రం) ఒక అంశంగా ఉండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు.

May 9, 2025 / 06:18 AM IST

‘బోధనేతర సిబ్బందికి నూతన కార్యవర్గం ఏర్పాటు చేయండి’

MBNR: పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పాలమూరు యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగులు వీసీ ఆచార్య శ్రీనివాస్‌కి గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గంలో అంతర్గత కలహాల వల్ల బోధన, ఇతర సిబ్బంది పూర్తిస్థాయిలో నష్టపోతున్నారని పేర్కొన్నారు.

May 9, 2025 / 04:50 AM IST

ఆపరేషన్ కగార్‌లో మరణించిన పల్వంచ కానిస్టేబుల్

NZB: పాల్వంచ గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్, ఆపరేషన్ కగర్‌లో భాగంగా ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న సమయంలో ల్యాండ్‌మైన్ పేలడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ దురదృష్టకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వడ్ల శ్రీధర్ మృతి పట్ల స్థానికులు, సహచరులు తీవ్ర శోకాన్ని వ్యక్తం చేశారు.

May 8, 2025 / 08:26 PM IST

‘ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పెంచాలి’

NZB: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లను భారీగా పెంచడానికి అందరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో DIEO అధ్యక్షతన సమన్వయ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. రానున్న సప్లమెంటరీ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలన్నారు.

May 8, 2025 / 08:21 PM IST

ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా రేపు భారీ ర్యాలీ

NZB: ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ మద్దతుగా ఈనెల 9న భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత తెలిపారు.

May 8, 2025 / 08:13 PM IST

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

NRML: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

May 8, 2025 / 07:53 PM IST

సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ

HYD: సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. గురువారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యేని కలిశారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా.. కార్పొరేటర్ల ద్వారా తన దృష్టికి తేవాలని అన్నారు.

May 8, 2025 / 07:43 PM IST

ఉత్తమ దర్శకునిగా జిల్లా వాసి

NRML: జిల్లాకు చెందిన డాక్టర్ వేణుగోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ‘ప్రేమతో నాన్న’ లఘు చిత్రానికి ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాదులో వారికి ప్రశంసా పత్రం, అవార్డును టాలీవుడ్ దర్శకుల అసోసియేషన్ సభ్యులు మోహన్, వీ.సముద్రలు అందజేశారు. ఉత్తమ దర్శకుడిగా జిల్లా వాసి ఎన్నికవ్వడంపట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

May 8, 2025 / 07:39 PM IST

GOVT డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

HYD: హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఇంటర్ పాసైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సురేశాబాబు గురువారం తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 840 సీట్లు ఉన్నాయని, దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

May 8, 2025 / 07:11 PM IST

చర్చకు మేం సిద్ధం: కాంగ్రెస్

NZB: MLA ప్రశాంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రా మేము సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గురువారం వారు మాట్లాడుతూ.. ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, CMపై చేసిన ఆరోపణలు ఆయన అహంకారానికి, రాజకీయ అవివేకానికి నిదర్శనమని అన్నారు.

May 8, 2025 / 06:39 PM IST