HYD: పాతబస్తీ కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా నగర్ వద్ద అతివేగంగా వచ్చిన కారు (TS 12 C 8502) 8 సంవత్సరాల అమెర్ అలీ అనే మైనర్ బాలుడిని ఢీకొట్టింది. అలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
BHNG: తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు 17న బంద్ ప్రకటించడంతో జిల్లా రైతులకు కలెక్టర్ హనుమంత రావు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. రైతులు 17న పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు లేదా జిన్నింగ్ మిల్లులకు అమ్మకానికి తీసుకురాకూడదని, ఆ సీసీఐ యాప్లో స్లాట్ బుకింగ్ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
NGKL: జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ కేసరి సముద్రంలో సోమవారం ఉదయం చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుచుకూళ్ల రాజేష్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ఉదయం 10:30 వరకు రావాలని ఆయన తెలిపారు.
NZB: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వేల్పూర్లోని తన స్వగృహంలో మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మెండోరా మండలంకు చెందిన 35 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్పై సంతకాలు చేశారు.
NLG: పత్తి కొనుగోళ్లు, రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం కలెక్టరెట్లో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో సమీక్షించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లర్లు పత్తిని కొనుగోలు చేయాలన్నారు. రైతులు 12 క్వింటాళ్ల వరకు పత్తిని అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
WNP: వయోవృద్ధుల సంరక్షణ చట్టం2007 ప్రకారం వృద్ధులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా, ఫిర్యాదు చేసిన తక్షణమే తగిన న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి తెలిపారు. ఇవాళ వనపర్తి ఆర్డీవో కార్యాలయంలో ఈ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె వెల్లడించారు.
KMR: ఈ నెల 18న మాస శివరాత్రి సందర్భంగా, సుమారు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన తాండూర్ త్రిలింగ రామేశ్వర దేవాలయం వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తు ఆదివారం పక్రటనలో తెలిపారు. మొట్టమొదటిసారిగా ఆలయంలో నిర్వహించనున్న ఈ వ్రత కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై, పూజల్లో పాల్గొన్నాలన్నారు.
WNP: కాంగ్రెస్ ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు శాలువాతో సన్మానం చేసి, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు గడ్డం వినోద్ యాదవ్, దేవన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
MDK: మెదక్ పట్టణంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మధ్యాహ్నం 12 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాపన్నపేట మండలం చికోడు, నాగసాన్ పల్లిలో నూతనంగా నిర్మించిన పశువైద్యశాలను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు
NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు గచ్చు బావి వద్ద పూజలో ఆయన పాల్గొంటారు. 11 గంటలకు ఆర్టీసీ బస్టాండ్లో కొత్త బస్సులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వెల్దండలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం, 2 గంటలకు మండల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారు.
VKB: కొడంగల్ మండలం రుద్రారం గ్రామంలో విద్యుత్ దీపాల మరమ్మతులు జరుగుతున్నాయి. ఈనెల 17,18,19వ తేదీలలో మూడు రోజులపాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని AE ప్రవీణ్ కుమార్ తెలిపారు. రుద్రారం, నాగారం, పాటీమీదిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు విద్యుత్ అంతరాయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
VKB: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆదివారం గడిసింగాపూర్ గ్రామంలోని ఇద్దరు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆదుకుంటుందన్నారు.
SRCL: వేములవాడ మండలం అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
SRPT: అనంతగిరి మండలం తెల్లబండ తండాలో కుక్కల దాడిలో మల్సూర్ అనే రైతుకు చెందిన గొర్రె మృతి చెందింది. ఆదివారం రాత్రి ఈ దాడి జరిగిందని, దీంతో సుమారు పదివేల రూపాయల వరకు నష్టపోవాల్సి వచ్చిందని మల్సూర్ తెలిపారు. గొర్రెల సాగుతో జీవనం సాగిస్తున్న తమకు, కుక్కల దాడితో నష్టం వాటిల్లినందున ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలికల కోసం ఏర్పాటు చేసిన ‘ఆస్మిత’ ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్స్ నేడు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లీగ్స్ KMR ఇందిరా గాంధీ స్టేడియంలో 8 గంటలకు ప్రారంభం అవుయన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ, బోనఫైడ్తో హాజరు కావాలన్నారు.