• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మద్యం దుకాణాలకు 18వరకు దరఖాస్తులు

RR: శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 3 స్టేషన్లలో మొత్తం 111 మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో శంషాబాద్‌లో 40, శేరిలింగంపల్లిలో 44, చేవెళ్లలో 27 ఉన్నాయి. దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. బీసీ గౌడ్స్‌కు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% కేటాయించారు. అయితే ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. దరఖాస్తులను 23వ తేదీన లాటరీ నిర్వహించనున్నారు.

October 11, 2025 / 08:12 AM IST

12.50 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

HYDలో ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. ఒకేసారి 4 ప్రాంతాల్లో క‌బ్జాల నుంచి ప్ర‌భుత్వ భూమికి విముక్తి క‌ల్పించింది. 12.50 ఎక‌రాల మేర ప్ర‌భుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఇప్పటి వరకు వేలకొద్దీ కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడిందని తెలిపారు.

October 11, 2025 / 08:11 AM IST

‘బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి’

WGL: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేశ్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని హెడ్ పోస్టాఫీస్, సెంటర్లో శుక్రవారం నిరసన చేపట్టారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో పాలకవర్గాలకు చిత్తశుద్ధి లేదనడానికి హైకోర్టు స్టేనే కారణమన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారన్నారు.

October 11, 2025 / 08:10 AM IST

ప్రాజెక్టు‌కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఒక గేటు ఓపెన్

NRML: భైంసా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తివేసి దిగువనకి 660 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు శనివారం ఉదయం తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు 300 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో రావడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిండుకోవడంతో ఒక గేటు ఎత్తివేసినట్లు తెలిపారు.

October 11, 2025 / 08:08 AM IST

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 21 గేట్లు ఎత్తివేత

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 75,394 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 21 వరద గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కుల నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ, ఎస్కేప్ గేట్లు, సరస్వతి కాలువ, మిషన్ భగీరథ ద్వారా కూడా నీటిని విడుదల చేస్తున్నారు.

October 11, 2025 / 08:07 AM IST

నేడు కన్హా శాంతివనానికి కేంద్రమంత్రి రాక

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామ సమీపంలో ఉన్న కన్హా శాంతి వనానికి నేడు కేంద్రమంత్రి ప్రతాపరావు జాదవ్, గుజరాత్ రాష్ట్ర మంత్రి ఋషికేష్ పటేల్ రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శాంతివనంలో జరిగే అంతర్జాతీయ ఆరోగ్య సమావేశంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.

October 11, 2025 / 08:03 AM IST

MBNR రూరల్ సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు

MBNR: మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. జానకి శుక్రవారం వార్షిక తనిఖీ నిర్వహించారు. MBNR రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. ఎస్పీ సర్కిల్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, ట్రాఫిక్ వ్యవస్థను మరింత క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

October 11, 2025 / 08:03 AM IST

మిస్సింగ్ ఫోన్లను అందించిన పోలీసులు

WGL: వరంగల్ పోలీసులు CEIR పోర్టల్ ద్వారా రూ.6.80లక్షల విలువైన 32 మిస్సింగ్, ఫోన్లను విజయవంతంగా ట్రేస్ చేసి రికవరీ చేశారు. ఏఎస్పీ శుభం ప్రకాష్, మట్టెవాడ సీఐ కరుణాకర్ చురుకైన పర్యవేక్షణలో కానిస్టేబుల్ మాచర్ల సుమన్ CEIR సిస్టమ్ను సమర్థవంతంగా ఉపయోగించి మిస్సింగ్, దొంగిలించిన ఫోన్లను గుర్తించి ట్రేస్ చేశారు. సదరు ఫోన్లను బాధితులకు శుక్రవారం పోలీసులు అందజేశారు.

October 11, 2025 / 07:59 AM IST

ఇసుక రవాణా పై అధికారులు హెచ్చరిక

BHPL: జిల్లా వ్యాప్తంగా ఇసుక రవాణా నియమాలు ఉల్లంఘించే వారిపై, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లో ఒరిజినల్, డూప్లికేట్ కూపన్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. లోడింగ్ తర్వాత అధికారి సంతకంతోనే రవాణా చేయాలని, పర్మిషన్ కాపీ లేకుంటే చర్యలు తప్పవని తెలిపారు.

October 11, 2025 / 07:52 AM IST

‘ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి ఉండాలి’

JGL: ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి ఉండాలని TUWJ జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాలలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు యూనియన్‌లో సభ్యత్వం కల్పిస్తామని, నవంబర్ 10 లోగా సభ్యత్వం పొందిన జర్నలిస్టులందరికీ ఐడీ కార్డులను అందజేస్తామని పేర్కొన్నారు.

October 11, 2025 / 07:51 AM IST

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి: ANM

MBNSR: మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేట్, వీరభద్ర కాలనీలో ఫ్రైడే-డ్రై డే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సీజనల్ వ్యాధుల గురించి వివరించారు. కుమార్ వాడి UPHC ANM మంజూల, మున్సిపల్ అధికారుల సమన్వయంతో కలిసి అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. డెంగీ, మలేరియాల గురించి ఇంటింటికి వెళ్లి వీధి ప్రజలకు తెలిపారు. నీటిని ఇంటి పరిసరాలలో నిల్వ ఉండకుండా తగిన శుభ్రతలను పాటించాలని అన్నారు.

October 11, 2025 / 07:48 AM IST

వాహన అద్దాలకు బ్లాక్ ఫిలిం నిషేధం: ఎస్సై

SRPT: కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం వేయించడం మోటార్ వాహన చట్టరీత్యా నేరమని, మోతే ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం మోతే మండల పరిధిలోని జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బ్లాక్ ఫిలిం వాడుతున్న కార్లను గుర్తించి, వాటిని తొలగించే చర్యలు తీసుకున్నామన్నారు.

October 11, 2025 / 07:47 AM IST

‘డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు సమర్పించాలి’

KMM: ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలోని డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.శంకర్ తెలిపారు. డిప్లొమా ఇన్ అనెస్తేషియా టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సులకు అభ్యర్థులు అక్టోబరు 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేసి, ప్రింట్ పత్రాలను, ధ్రువపత్రాలను జతచేసి కళాశాలలో సమర్పించాలన్నారు.

October 11, 2025 / 07:44 AM IST

‘దొంగతనాలు జరిగిన, అనుమానస్పద వ్యక్తులు ప్రవేశించిన గుర్తించవచ్చు’

VKB: దుద్యాల్ మండల పరిధిలోని గౌరారంలో రెండు CC కెమెరాలు ఏర్పాటు చేసినట్లు SI యాదగిరి తెలిపారు. గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పులిందర్ రెడ్డి సొంత ఖర్చుతో ప్రధాన కూడలిలో CC కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో CC కెమెరాలు దొంగతనాలు జరిగిన, అనుమానస్పద వ్యక్తులు గ్రామంలోకి ప్రవేశించిన గుర్తించవచ్చన్నారు.

October 11, 2025 / 07:44 AM IST

ఉపాధి హామీ కూలీల ఐడెంటిఫికేషన్

BHPL: కాటారం మండలం దామెరకుంటలో ఉపాధి హామీ కూలీల ఐడెంటిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరి ఫొటో ఐడెంటిఫికేషన్ చేస్తున్నామని, ఇప్పటి వరకు 70% పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. జాబ్ కార్డు కలిగిన వారంతా తమ ఫొటో ఐడెంటిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

October 11, 2025 / 07:38 AM IST