MLG: న్యూ-ఢిల్లీలోని ఇందిరా భవన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు విక్రాంత్ భూరియా అధ్వర్యంలో జరిగిన ఏఐసీసీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆదివాసీల హక్కులు, అభివృద్ధి, స్వాభిమానాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు.