BHNG: వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో గ్రామ సర్పంచ్ జడిగే బుచ్చయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన మాజీ ఛైర్మన్ మొగిలిపాక ముద్దసాని కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శివాజీ యొక్క గొప్ప పనులను స్మరించుకున్నారు. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.