SRD: ఖేడ్ పట్టణం పరిధి మంగళ్ పేట్ భవాని మందిరం ఆలయాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆయన సతీమణి అనుపమ రెడ్డి గురువారం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ జరుగుతున్న జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు ఉన్నారు.