KMM: ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానన్న భయంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లరుపల్లికి చెందిన భవాని పీజీ పూర్తి చేసి, గత కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాకపోవడం, ఉద్యోగం వస్తుందో లేదోనన్న ఆందోళనతో నిన్న మనస్తాపం చెంది గడ్డిమందు తాగింది. పూర్తి సమాచారం తెలియల్సి ఉంది.