HNK: ఐనవోలు మండల కేంద్రంలోని బోడాగుట్ట వద్ద పోలీసులు గంజాయి సేవిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. బుధవారం రాత్రి ఎస్సై పస్తం శ్రీనివాస్ సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని. జన్ను ప్రణీత్ కుమార్, కొత్తూరు భాను ప్రసాద్, జంపాల లక్ష్మణ్, ఓ మైనర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.