• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సేవలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలి: కలెక్టర్

ADB: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామక ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో సమావేశమై మాట్లాడారు. జిల్లాలోని రైతాంగానికి, సహకార సంఘాలకు వెన్నెముకగా ఉన్న DCCB సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో CEO పాత్ర కీలకమని అన్నారు.

April 24, 2026 / 08:02 PM IST

ముగ్గురు విద్యార్థులు డిబార్

KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 4వ, 6వ సెమిస్టర్ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) పరీక్షలు కొనసాగుతున్నాయి. 4వ సెమిస్టర్ పరీక్షల్లో ఒక్కరు, 6వ సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడగా డిబార్ చేసినట్లు శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. డీ. సురేష్ కుమార్ తెలిపారు.

April 24, 2026 / 08:02 PM IST

కలెక్టర్‌ను కలిసిన నూతన మున్సిపల్ ఛైర్మన్

NRML: ఖానాపూర్ మున్సిపల్ నూతన ఛైర్‌పర్సన్ అంకం మౌనిక జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను శుక్రవారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లతో కలిసి పూలమొక్క అందజేసి శాలువాతో సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థంగా పనిచేయాలని కలెక్టర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు సూచించారు.

April 24, 2026 / 08:02 PM IST

‘జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి’

JGL: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, 252 జీవో అనుసరించి నియమ నిబంధనలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తారన్నారు.

April 24, 2026 / 08:01 PM IST

ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలి: ఝాన్సీరెడ్డి

MHBD: ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

April 24, 2026 / 08:01 PM IST

ఆర్టీసీ సమ్మెకు జనసేన మద్దతు

WNP: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన బాధాకరమని వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. కార్మికులు ఆత్మహత్యలకు దూరంగా ఉండి ధైర్యంగా పోరాడాలని కోరారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆయన సానుభూతి వ్యక్తం చేశారు.

April 24, 2026 / 08:00 PM IST

తిమ్మాపూర్‌లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

KMR: ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు, త్యాగాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సోని ప్రకాష్, ఉప సర్పంచ్ సతీష్, మండల నాయకులు, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

April 24, 2026 / 08:00 PM IST

ఉపాధి హామీ పనులు పరిశీలించిన డీఆర్డీవో

NZB: రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం డీఆర్డీవో సాయన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని జీపీ కార్యదర్శి మోహన్‌ను ఆదేశించారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలగంగాధర్, ఈజీఎస్ ఏపీవో రాజేశ్వర్, సర్పంచ్ శంకర్ ఉన్నారు.

April 24, 2026 / 08:00 PM IST

మ‌ధు, ధ‌నుంజ‌య్ గౌడ్‌ల‌కు మాజీ ఎమ్మెల్యే నివాళి

NLG: గుర్రంపోడ్ వ‌ద్ద మొన్న జ‌రిగిన ప్ర‌మాదంలో క‌న‌గ‌ల్‌కు చెందిన న‌ర్సింగ్ మ‌ధు గౌడ్‌, న‌ర్సింగ్ ధ‌నుంజ‌య్ గౌడ్ మృతి చెందారు. మృత‌దేహాల‌ను శుక్ర‌వారం న‌ల్ల‌గొండ మాజీ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి సంద‌ర్శించి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. వారి కుటుంబ స‌భ్యుల‌న...

April 24, 2026 / 08:00 PM IST

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

MNCL: రైతు మేలుకోసమే మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని లక్షెట్టిపేట ఏఎంసీ ఛైర్మన్ ప్రేమ్చంద్, వైస్ ఛైర్మన్ ఎండీ. ఆరిఫ్ అన్నారు. తెలంగాణ మార్క్ ఫెడ్ ద్వారా పట్టణంలోని ఏఎంసీలో ఏర్పాటుచేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

April 24, 2026 / 07:57 PM IST

BREAKING: ఐపీఎస్ అధికారుల బదిలీలు

HYD: రాష్ట్రంలో IPS అధికారుల బదిలీలు జరిగాయి. ACB డైరెక్టర్ తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ సీపీగా బదిలీ చేశారు. విజిలెన్స్ డీజీగా ఉన్నా షికా గోయల్‌ను హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇంటలిజెన్స్ SIB సుమతిని మల్కాజ్గిరి సీపీగా, మల్కాజ్గిరి సీపీ అవినాష్ మహంతిని డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.

April 24, 2026 / 07:51 PM IST

ఈనెల 26న BHPL జిల్లాకు రానున్న విశారదన్ మహారాజ్

BHPL: చిట్యాలలో BC, SC, ST JAC ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లా నాయకుడు నాగరాజ్ మాట్లాడుతూ.. BC, SC, ST హక్కుల కోసం ఉమ్మడి జిల్లాను వేదిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 26న BHPL జిల్లాలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే సభకు రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహరాజ్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలన్నారు.

April 24, 2026 / 07:46 PM IST

అప్పటి రాచకొండ సీపీ.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ సీపీ!

RR: రాచకొండ పోలీస్ కమిషనరేట్లో గతంలో సీపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఐపీఎస్ తరుణ్ జోషికి ఇప్పుడు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఫ్యూచర్ సిటీ సీపీగా ఉన్న సుధీర్ బాబు సైతం, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు ముందు వరకు రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. రాచకొండలో అనుభవం ఉన్నవారికే ఫ్యూచర్ సిటీ సీపీ పోస్టు దక్కింది.

April 24, 2026 / 07:44 PM IST

భద్రతపై పోలీసుల వినూత్న అవగాహన

SDPT: హుస్నాబాద్‌లో ట్రాఫిక్ భద్రతపై వాహనదారుల్లో చైతన్యం పెంచేందుకు పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మొగిలి నాయక్ హ్యాండ్ మైక్‌తో పాట రూపంలో వేగం కన్నా ప్రాణం మిన్న అనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని అన్నారు.

April 24, 2026 / 07:38 PM IST

ఫెయిల్ భయంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

MDK: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాలిలా.. పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి తండా బానోత్ సాయిప్రియ(17) టెన్త్ పరీక్షలు సరిగా రాయలేదని కొద్దిరోజులుగా దిగులుగా ఉంది. తల్లి ధైర్యం చెప్పినా వినకపోగా ఇవాళ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

April 24, 2026 / 07:37 PM IST