• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

” సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి’

NRPT: రేపు నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోట్ల మధుసూదన్ రెడ్డి కోరారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించబోతున్న సీఎంకి ఘనంగా స్వాగతించేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.

February 20, 2025 / 12:51 PM IST

జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం

ADB: ఆదిలాబాద్‌లోని ఓ ఛానెల్లో పనిచేస్తూ అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన కంచు సుభాష్ కుటుంబానికి జర్నలిస్ట్ JAC ఆర్థిక సాయం అందించింది. మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవడానికి జేఏసీ పిలుపు మేరకు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ కలిసి రూ.52,100 నగదు జమచేసి వాటిని గురువారం సుభాష్ భార్యకు అందించారు.

February 20, 2025 / 12:47 PM IST

పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డిఇఓ

NRML: లక్ష్మణ్చందా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డిఇఓ రామారావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పది పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల పలు అనుమానాలను నివృత్తి చేశారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు.

February 20, 2025 / 12:25 PM IST

డంపింగ్ యార్డ్‌ను వెంటనే తరలించాలి

MNCL: బెల్లంపల్లి పట్టణం పోచమ్మ గడ్డ వద్ద కొనసాగుతున్న చెత్త డంపింగ్ యార్డ్ వెంటనే తరలించాలని లేనిపక్షంలో ఆటో డ్రైవర్లందరం రహదారిపై బైఠాయించి ధర్నా చేపడతామని ఆటో యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ గురువారం హెచ్చరించారు. వారు మాట్లాడుతూ.. నిత్యం వేలాదిమంది ప్రజలు, విద్యార్థులు ప్రయాణిస్తుంటారని దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

February 20, 2025 / 12:25 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి

PDPL: సింగరేణి సంస్థ ఆడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికుడు ఊరగొండ రాజకుమార్ గురువారం ఉదయం కలవచర్ల గ్రామంలోని భోక్కల వాగు బ్రిడ్జిలో పడి మరణించాడు. పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిలో ఈ దుర్ఘటన జరిగినది. మంథని సీఐ రాజు, ఎస్సై దివ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

February 20, 2025 / 11:22 AM IST

త్వరలో సహాయ ఉపకరణాలు పంపిణీ

MNCL: దివ్యాంగులకు త్వరలో సహాయ ఉపకారణాలను పంపిణీ చేయనున్నామని వైద్య అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు లక్షెట్టిపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ రైతు వేదికలో దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకారణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి దివ్యాంగులు భారీగా తరలివచ్చారు. వారి సదరం సర్టిఫికెట్లను వైద్యులు పరిశీలించారు.

February 20, 2025 / 11:12 AM IST

కురవి ఆలయంలో హీరో గోపీచంద్ పూజలు

MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయాన్ని ప్రముఖ సిని హీరో గోపిచంద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గోపిచంద్‌కు ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, దర్మకర్త చిన్నం గణేష్‌లు అందజేశారు. కాగా, ఆయన అభిమానులు, స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు.

February 20, 2025 / 11:06 AM IST

అధికారులు తిట్టారని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

MNCL: అటవీ అధికారులు తిట్టారని జన్నారం మండలంలోని గడంగూడాకు చెందిన తుకారాం ఆత్మహత్యాయత్నం చేశాడని స్థానికులు తెలిపారు. గడంగూడాలో స్థానికులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. గురువారం అటవీ అధికారులు వచ్చి వెళ్లిపోవాలని దుర్భాషలాడారన్నారు. తుకారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో జన్నారం అటవీ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఆస్పత్రికి తరలించారు.

February 20, 2025 / 10:34 AM IST

వక్ఫ్ బోర్డు సీఈఓకు ఫిర్యాదు

WGL: రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓని పర్వతగిరి మండలానికి చెందిన పలువురు ఈరోజు కలిసి ఫిర్యాదు చేశారు. అన్నారం దర్గా వద్ద తలనీలాలను రెండేళ్లుగా టెండర్ వేయకుండా వెంట్రుకలు పోగుచేసి అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దొంగతనంగా తలనీలాలు అమ్ముకొని, వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.

February 20, 2025 / 08:18 AM IST

తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముంజాల స్వామి (48) రోజు వారీగా గీత కార్మిక వృత్తిలో భాగంగా బుధవారం తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారి పడి మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

February 20, 2025 / 07:55 AM IST

21ఏళ్లుగా ఊపిరితిత్తుల్లో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్ క్యాప్: తొలగించిన వైద్యులు

KNR: కిమ్స్ హాస్పిటల్ వైద్యులు 21 ఏళ్లుగా ఊపిరితిత్తులలో ఉండిపోయిన ప్లాస్టిక్ పెన్ క్యాప్ విజయవంతంగా తొలగించారు. కరీంనగర్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు 5 ఏళ్ల వయసులో పెన్ క్యాప్ మింగేశాడు. అప్పుడు ఓ వైద్యుడు పరీక్షించి ఏ ఇబ్బంది లేదన్నారు. 10 రోజులుగా అతను అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లు CT స్కాన్ చేసి హెలిక్యాప్ గుర్తించి వెలికి తీశారు.

February 20, 2025 / 07:18 AM IST

వేసవులు తాగునీటి సమస్యలు లేకుండా చూసుకోవాలి

NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు, గ్రామీణ ప్రాంతంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోను ఆదేశించారు. బుధవారం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో తాగునీటి సరఫరాపై ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారిగా అడిగి తెలుసుకున్నారు.

February 19, 2025 / 08:00 PM IST

అభ్యంతరాల స్వీకరణ గడువు పొడగింపు: కలెక్టర్

NRML: వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 24వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా, అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 20వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.

February 19, 2025 / 07:44 PM IST

విద్యుత్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: జమ్మిగడ్డ ఎస్ఈ విద్యుత్ సర్కిల్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తనిఖీ చేశారు. జిల్లాలో ప్రతిరోజు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు. ఎంత లోడ్ వాడుతున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వచ్చే వేసవి దృష్ట్యా వ్యవసాయ రంగానికి, గృహ రంగానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా సరఫరా చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు.

February 19, 2025 / 07:28 PM IST

ప్రయాణికులకు మెరుగైన ఫీవర్ అందించాలి: ఆర్ ఎం

NRML: ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్ఎం సొలోమోన్ అన్నారు. నిర్మల్ బస్ డిపోలో నిర్వహిస్తున్న శిక్షణ ఇవాళ నాటికి రెండో రోజుకు చేరుకుంది. సమిష్టిగా కృషి చేస్తూ సంస్థ మనుగడకు పాటుపడాలని అన్నారు. అనంతరం ఉద్యోగులకు మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి, రాజశేఖర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.

February 19, 2025 / 07:16 PM IST