WNP: ప్రజా ప్రభుత్వ పాలనలో పేదల ఆరోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం లభిస్తోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. రాయిగడ్డ కాలనీకి చెందిన వంశిమోని బుచ్చన్నకు సోమవారం రూ.22 వేల CMRF చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అమలుచేస్తుందని ఆయన తెలిపారు.
WGL: నెక్కొండ మండలం పెద్దకొర్పోల్ గ్రామంలో ఏలియా, మమత దంపతుల మరణంతో అనాథలైన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై నెక్కొండ ఎస్సై మహేందర్ స్పందించారు. తన సొంత ఖర్చులతో బాలికల కోసం రెండు గదుల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఆయన, సోమవారం గ్రామంలో ముగ్గు పోసి భూమి పూజ నిర్వహించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ చర్య పలువురి ప్రశంసలు పొందుతోంది.
WGL: నెక్కొండ మండలం పెద్దకొర్పోల్ గ్రామంలో ఏలియా, మమత దంపతుల మరణంతో అనాథలైన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తుపై నెక్కొండ ఎస్సై మహేందర్ స్పందించారు. తన సొంత ఖర్చులతో బాలికల కోసం రెండు గదుల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఆయన, సోమవారం గ్రామంలో ముగ్గు పోసి భూమి పూజ నిర్వహించారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ చర్య పలువురి ప్రశంసలు పొందుతోంది.
KMM: నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజీ పనులకు సర్పంచ్ నరేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో వెలిసిన శ్రీ శ్రీ శ్రీ జములమ్మ దేవి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ ధర్మకర్త మంగలి నరసింహులు సోమవారం తెలిపారు. రేపు అమ్మవారికి పట్టువస్త్రాలు ఆభరణాలు అలంకరణ కార్యక్రమం ఉంటుందన్నారు. మార్కండేయ స్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఆభరణాల కార్యక్రమం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని ఆయన కోరారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కోరారు. సోమవారం కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన బాకీ కార్డు ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. 25 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పడ్డ బాకీని ప్రతి ఒక్కరికి వివరించాలని చెప్పారు.
MBNR: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఒక వ్యక్తికి గాయాలైన ఘటన సోమవారం జడ్చర్ల రైల్వే స్టేషన్లో జరిగింది. కాచిగూడకు వెళ్లే రైలు ఎక్కే ప్రయత్నంలో HYDకు చెందిన అంజయ్య ప్లాట్ ఫామ్పై జారిపడ్డాడు. తలకు, రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే సిబ్బంది 108కు సమాచారం ఇవ్వగా క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
NGKL: వెల్దండ మండలానికి చెందిన ప్రముఖ కవి, సాహిత్య వేత్త రుక్మంధర రెడ్డి సోమవారం ఉదయం మరణించారు. నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్య చరిత్రలో రుక్మంధర రెడ్డి పండిత కవిగా పేరుగాంచారు. ఆయన మృతి పట్ల నెలపొడుపు, వెన్నెల, తెలంగాణ సాహితీ సంస్థలు, కవులు సాహిత్య అభిమానులు ప్రగాఢ సంతాపం తెలిపారు. రుక్మంధర రెడ్డి మరణం జిల్లా సాహిత్యానికి తీరని లోటని పేర్కొన్నారు.
NRPT: కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు తమ శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు.
WGL: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.
NZB: ఎడపల్లి మండలం జానకంపేటలోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల గోడప్రతులను సోమవారం ఆవిష్కరించారు. జానకంపేట్, తానాకలాన్ చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచన కోట అనురాధ కిషన్ గౌడ్, నాయకులు విజయ్ కుమార్ గౌడ్, సురేశ్ పాల్గొన్నారు.
RR: న్యూ నాగోల్ మెయిన్ రోడ్డులో స్టార్మ్ వాటర్ పైప్ లైన్ పనులను జలమండలి డీజీఎం రవీందర్ వర్మతో కలిసి కార్పోరేటర్ నాయికోటి పవన్ కుమార్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను క్రమబద్ధంగా నియంత్రించాలని, ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే సమస్యలు తొలగి, ప్రజలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
WNP: గోపాల్ పేట మండలం తాడిపర్తిలో గ్రామపంచాయతీ కార్యాలయానికి సమీపాన ఉన్న గ్రంథాలయం నిరుపయోగంగా ఉంది. పదేళ్ల క్రితం గ్రామ మాజీ సర్పంచ్ గ్రామంలోని నిరుద్యోగులు, విద్యార్థుల కోసం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. నేడు గ్రంథాలయంలో భద్రత సిబ్బంది లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. అధికారులు చొరవ తీసుకుని గ్రంథాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
గద్వాల్ మున్సిపాలిటీ 37 వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో MLA కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SRPT: కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్కు చెందిన లక్ష్మీబాయి మృతి పట్ల కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె నివాసానికి వెళ్లిన ఆయన, లక్ష్మీబాయి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.