KMM: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాదిలోపే ముజామ్మిల్ ఖాన్ బదిలీ అయ్యారు. అటు ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏడాది సర్వీస్లో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ జిల్లాలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
KMRD: పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం జిల్లాలో ఏఎస్సై, సివిల్ హెడ్ కానిస్టేబుల్స్, బదిలీల ప్రక్రియను ఎస్పీ నిర్వహించారు. బదిలీలను అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్పై పూర్తి పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో చేపట్టారన్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి 15 రోజుల హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి. రూ. 86 లక్షల 85 వేల 3 వందల ఏడు రూపాయలు వచ్చినట్లు ఈవో వినోద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బంగారం 83 గ్రాములు, వెండి 05 కిలోల 500 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపును ఈవో వినోద్ పర్యవేక్షించారు.
కామారెడ్డి: జిల్లాకు చెందిన సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి రూ. లక్ష విరాళం అందజేశారు. దేశరక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో దేశరక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న త్రివిధ దళాల సేవలు మరవలేనివని అన్నారు.
KMR: జుక్కల్ నియోజకవర్గం ఎరువుల దుకాణదారులు రైతులకు అమ్మే ఎరువులు ఎమ్మార్పీ ధరలకే అమ్మాలని, అధిక ధరలతో అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మద్నూర్ మండల వ్యవసాయ అధికారి రాజు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం మద్నూర్ మండలంలో మద్నూర్ సొసైటీ, పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
KMR: ఎల్లారెడ్డి 9వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుపతి తన ఉదారత చాటుకున్నారు. పట్టణానికి చెందిన రాములు అనే వృద్ధుడికి కళ్లు కనిపించవు. కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఒంటరిగా పాడుబడిన ఇంట్లో ఉండగ.. ఇటీవల వర్షానికి అది కూలిపోయింది. విషయం తెలుసుకున్న తిరుపతి వృద్ధుడిని అద్దె ఇంట్లోకి మార్చారు. ప్రతినెలా అద్దె చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పలువురు ఆయన్ను అభినందించారు.
SRCL: జిల్లా కలెక్టరేట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. జూన్ 21న జరిగే యోగా కార్యక్రమానికి ప్రజలంతా హాజరుకావాలని అధికారులు సౌమిని,శ్వేత, డీపీవో తిరుపతి, యోగా శిక్షకులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జూన్ 19న కలెక్టరేట్ ఆవరణలో అధికారులతో కలిసి యోగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
KMR: రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శిరీష సందర్శించారు. రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్థులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను మెడికల్ ఆఫీసర్ డా.విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. NCD సేవలను పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో విస్తరించాలన్నారు. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
NZB: జులై 9న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆశా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు స్వప్న పిలుపునిచ్చారు. గురువారం వర్నిలో ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను బలోపేతం చేయాలన్నారు.
MBNR: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర మైండ్లు ఇస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
కామారెడ్డి: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, పట్టణ వార్డు ఇంఛార్జీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులకు పోచారం ఫోన్లో సూచనలు చేశారు.
SRCL: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యం అని పేర్కొన్నారు.
GDWL: రేపు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి గద్వాల రానున్నారని జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. శుక్రవారం ఉదయం 9:30కి పుటాన్ పల్లిలో సీడ్ పత్తి పంట స్థితిగతులపై సమీక్ష నిర్వహించనున్న ఆయన, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఉదయం 11:30కి ఐడీవోసీ మందిరంలో విత్తన పత్తి రైతులతో సమావేశం జరగనుంది.
KMR: పట్టా భూములను సాదాబైనామాల ద్వారా కాకుండా కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో గురువారం భూభారతి రెవెన్యూ సదస్సును సందర్శించారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MBNR: జడ్చర్ల పట్టణంలో నేటి మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ సందర్భంలో జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి పట్టణంలోని నాగర్ కర్నూలు రోడ్డు ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక ప్రజలతో కలిసి జేసీబీపై తిరుగుతూ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.