JN: దేవరుప్పుల మండలానికి చెందిన మునగాల ఉమా ప్రకాష్కు చెందిన సెల్ ఫోన్ ఇటీవల దొంగలించబడింది. దీంతో ఉమా ప్రకాష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ సెల్ ఫోన్ను కోదాడలో ఉన్నట్టుగా గుర్తించి, కోదాడ నుంచి తీసుకొచ్చి అతని ఫోన్ను ఎస్సై సృజన్ కుమార్ చేతుల మీదుగా బాధితుడికి మంగళవారం అప్పగించారు. యాకూబ్ తదితరులున్నారు.
సూర్యాపేట జిల్లాలోని పశువులన్నిటికీ QR కోడ్ చెవి పోగులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక అధికారి డా. దామరచర్ల శ్రీనివాసరావు తెలిపారు. కోదాడ ప్రభుత్వ పశు వైద్యశాలలో కోదాడ, అనంతగిరి, చింతలపాలెం మండలాల సిబ్బందితో మంగళవారం గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమావేశంలో డా.పెంటయ్య, మధు పాల్గొన్నారు.
MNCL: ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో తాండూర్ మండల కేంద్రంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ దేవయ్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి IB చౌరస్తాలో నాకాబందీ నిర్వహించి, ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో సరైన ధ్రువపత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
జగిత్యాల కలెక్టరేట్లో జరిగిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ అమలుపై అధికారులతో కలెక్టర్ సత్య ప్రకాష్ సమీక్షించారు. జిల్లాలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 16 ఉప కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో 3,48,605 మంది నమోదు కాగా, 100% లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
WGL: గీసుకొండ మండలంలోని ప్రగతి మండల సమైక్య కార్యాలయంలో 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల బాలబాలికల కోసం స్నేహ లీడర్ శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ.. మొబైల్ వాడడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించారు. అనవసరమైన యాప్లు ఇన్స్టాల్ చేయకూడదని తెలిపారు.
GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ పరిధిలోని ఓ బావిలో మంగళవారం అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహంపై అనుమానాస్పద గాయాలు ఉన్నాయని గ్రామస్థులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRPT: నడిగూడెం మండలం బృందావనపురంలో అంగన్వాడీ భవన నిర్మాణాన్ని త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలని ఆర్డీవో సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. గ్రామంలో వివాదాస్పదంగా మారిన నిర్మాణ స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా మంజూరైన ప్రభుత్వ భవనాన్ని రాజకీయాలకతీతంగా నిర్మించుకోవాలని సూచించారు.
MBNR: జిల్లా జడ్చర్ల మండలానికి బుధవారం ఎంపీ డీకే అరుణ రానున్నట్లు దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ ఎర్ర శేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో ఉదయం 10.30 నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
BDK: భద్రాద్రి జిల్లాలో జనజాతీయ గౌరవ్ దివాస్ 2025 సందర్భంగా ఈ నెల 13న 131 ఆది సేవా కేంద్రాలలో గ్రామసభలు నిర్వహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. ఈ జన్ సున్వాయి సెషన్లో గ్రామాల మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజా స్పందనలపై చర్చిస్తారు. నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా జాతీయ వేడుకలు ఉంటాయన్నారు.
KMM: తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో మంగళవారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయింయచాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సరైన మద్దతు ధరను పొందాలని అధికారులు సూచించారు.
ASF: ఇందిరమ్మ ఇళ్లు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీలో మొక్కల పెంపకం, ఈనెల 14వ పేరెంట్స్ కమిటీ సమావేశంపై సమీక్ష నిర్వహించారు. 2 రోజులలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పనులు ప్రారంభించేలా చూడాలన్నారు.
MNCL: నెన్నెల మండలం గుండ్లసోమారం ZPSS పాఠశాలలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న ఉపాధ్యాయుడు షేక్ ఖాదర్ను విధులు నుంచి సస్పెండ్ చేసినట్లు మంచిర్యాల DEO యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుడిపై వచ్చిన కథనంపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నామన్నారు. అదే విధంగా పాఠశాల ఇన్ఛార్జ్ HM బానేష్కు షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు.
KNR: కేంద్రంలోని ఈనెల 6, 7వ తేదీలలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో 9వ తరగతికి చెందిన యన్. ప్రమధశ్రీ, యస్. శ్రీసాన్విక, కే. శ్రీవికాస్, కే. వైష్ణవి జాతీయ స్థాయి కళా ఉత్సవ్ (జాతీయస్థాయి) పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులను ఈరోజు కలెక్టర్ పమేలా సత్పత్తి కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు.
మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ రానున్నారు. నేడు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావులతో కలిసి కురుమూర్తి స్వామిని దర్శించుకోనున్నారు. వారితో పాటు దేవరకద్ర నియోజకవర్గం శాసనసభ్యులు జీ. మధుసూదన్ రెడ్డితోపాటు ఇతర ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
ADB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో గుణాత్మక విద్య అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలం గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తామని ఆయన పేర్కొన్నారు.