• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘అపరిచితుల పట్ల బాలికలు జాగ్రత్తగా ఉండాలి’

JN: ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా జనగామ పట్టణ కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జ్ సి.విక్రమ్ హాజరై మాట్లాడుతూ.. బాలికలు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వేధింపులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, టీచర్లు లేదా భరోసా సెంటర్‌కి తెలియజేయాలని సూచించారు.

October 10, 2025 / 08:06 PM IST

ఓట్ చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: శ్రీనివాసరెడ్డి

ADB: దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓట్ చోరీ అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాలని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి కంది శ్రీ‌నివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్ర‌వారం కాంగ్రెస్ క్యాంపు కార్యాల‌యం నుంచి నియోజ‌క వ‌ర్గంలోని పలువురు నాయకులతో జూమ్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. బీజేపీ విధానాలను ఎండగట...

October 10, 2025 / 08:05 PM IST

లడ్డుకు బూజు.. విచారణకు ఆదేశించిన మంత్రి

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లడ్డూలకు బూజు పట్టిన ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించిన సమగ్ర విషయాలు అందజేయాలని ఆలయ అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అయితే ఎక్కడా ఎటువంటి లోపం జరగలేదని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

October 10, 2025 / 08:00 PM IST

119 డివిజన్ అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు

మేడ్చల్: జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ ఎండీని వ్యక్తి గతంగా కలిసి ఓల్డ్ బోయినిపల్లి 119 డివిజన్‌లో డ్రైనేజీ, మంచినీటి సరఫరా సౌకర్యాలకై 2.5 కోట్ల రూపాయల నిధులు మంజూరుకై కృషి చేసినట్లు డివిజన్ బీజేపీ నాయకులు ఏనుగు తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. డివిజన్‌లోని పలు కాలనీల అభివృద్ధి పనులకు ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.

October 10, 2025 / 07:59 PM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మాక్ డ్రిల్

HYD: ఆర్‌పీఎఫ్, అగ్నిమాపక శాఖ సహకారంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిమాపక భద్రతపై సమగ్ర వర్క్‌షాప్, మాక్ డ్రిల్‌ శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. సికింద్రాబాద్ ఆర్‌పీఎఫ్ సీఐ బీఎస్ సరస్వత్ మాట్లాడుతూ.. ప్రయాణికులు, సిబ్బందికి సురక్షితమైన, భద్రమైన వాతావరణాన్ని నిర్ధారించడంలో నిబద్ధతను పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు.

October 10, 2025 / 07:57 PM IST

అప్రమత్తతతోనే సైబర్ నేరాల నుంచి రక్షణ

SRPT: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో సైబర్ నేరస్థులు లింకులు పంపించి డబ్బులు కొల్లగొడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని నాగారం ఎస్సై యాకుబ్ సూచించారు. ఇవాళ నాగారం మండలం లక్ష్మాపురంలో గ్రామ ప్రజలకు బెట్టింగ్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్ కార్డ్ నంబర్, ఓటీపీ చెప్పవద్దని సూచించారు.

October 10, 2025 / 07:54 PM IST

గాంధీ ఆస్పత్రిలో ఉచిత ప్యూరిఫైడ్ కేంద్రాల ప్రారంభం

HYD: గాంధీ ఆస్పత్రిలో దాదాపు₹ 45 లక్షలతో మంచుకొండ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ కేంద్రాలను సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రారంభించారు. ఆస్పత్రిలో 20 చిన్న యూనిట్లు, నాలుగు పెద్ద యూనిట్లు, 25 ఆర్ఓ యూనిట్లను ఏర్పాటు చేశామని ఫౌండేషన్ ట్రస్ట్ మంచుకొండ వరుణ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో శ్రవణ్ మల్లేశం సతీష్ పాల్గొన్నారు.

October 10, 2025 / 07:52 PM IST

‘భూ సేకరణ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి’

KNR: కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు.

October 10, 2025 / 07:50 PM IST

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

NZB: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో అధ్యక్షుడు నాశెట్టి సుమన్, ప్రధాన కార్యదర్శి శేఖర్ కోరారు. జిల్లా కేంద్రానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన విన్నవించారు.

October 10, 2025 / 07:50 PM IST

‘ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికరిస్తున్నాం’

ADB: ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. శుక్రవారం ఉట్నూర్ అడిషనల్ DMHO కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఆధునిక సౌకార్యాలు కల్పించడం జరుగుతుందని, ఆదివాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు.

October 10, 2025 / 07:50 PM IST

సింగరేణి భూమి కబ్జా కాకుండా చూడాలని వినతి

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని సౌత్ కాస్కట్ గని కి సంబంధించిన సింగరేణి భూమి కబ్జా కాకుండా చూడాలని కోరుతూ మందమర్రి ఏరియా GMకి CPI, AITUC నాయకులు శుక్రవారం మెమోరాండం అందజేశారు. వారు మాట్లాడుతూ.. సింగరేణి స్థలంలో దేవుని విగ్రహాల పేరిట పూజలు చేసి కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. విచారణ జరిపి స్థలాన్ని సింగరేణి స్వాధీనంలోకి తీసుకోవాలని కోరారు.

October 10, 2025 / 07:50 PM IST

విద్యార్థులకు నాణ్యమైన‌ భోజనం అందించాలి: DEO

NLG: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని DEO బొల్లారం భిక్షపతి అన్నారు. శుక్రవారం క‌ట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రికార్డులు, భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థులచే పాఠ్య పుస్తకాలు చదివించి వారి పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

October 10, 2025 / 07:48 PM IST

‘మాకు ఇళ్లస్థలాలు ఇచ్చిన ఘనత దామోదర్ రెడ్డిదే’

SRPT: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చిత్రపటానికి ఇవాళ TG వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పూలమాళలు వేసి నివాళులు అర్పించారు. ఆయన 2013లో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న దాదాపు 70 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని TWJF అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు, కార్యదర్శి బుక్క రాంబాబు అన్నారు. ఆయన మరణం జిల్లా ప్రజలకి మాత్రమే కాక, జర్నలిస్టులకు కూడా తీరని లోటని పేర్కొన్నారు.

October 10, 2025 / 07:47 PM IST

ఈనెల 16న ఉచిత కంటి శిక్షణ శిబిరం

NGKL: జిల్లా కేంద్రంలో ఈనెల 16న ఉచిత కంటి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఆఫ్తాలామిక్ అధికారి శివారెడ్డి తెలిపారు. శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శిబిరానికి హాజరయ్యే వారు ఆధార్ కార్డుతో రావాలని ఆయన సూచించారు. శిబిరాన్ని సద్వనియోగం చేసుకొవాలని కోరారు.

October 10, 2025 / 07:47 PM IST

‘సోమవారం నాటికి అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి’

SRPT: సోమవారం నాటికి జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే సీతారామారావు అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో ఖరీఫ్ 2025-26 సీజన్‌కి సంబంధించి ధాన్యం సేకరణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతానికి జిల్లాలో 298 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపామని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు కల్గకుండా చూడాలని పేర్కొన్నారు.

October 10, 2025 / 07:40 PM IST