SRD: పటాన్చెరు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం భారతరత్న పీవీ నరసింహారావు ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 45 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.20.81 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తోందన్నారు.
JGL: మెట్పల్లి మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పారిశుద్ధ్య వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల రెన్యువల్, వనమహోత్సవ కార్యక్రమాలకు రూ.26 లక్షలు మంజూరు చేశారు. ఇంటింటికి మొక్కల పంపిణీకి రూ.16 లక్షలు, వార్డుల్లో డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులకు రూ.8.90 లక్షలు, మోటార్ల మరమ్మతులకు రూ.4.55 లక్షలు కేటాయింపు చేశారు.
ADB: TPCC ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన కుర్మే మహేందర్ను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో నేరడిగొండలో సోమవారం ఘనంగా సన్మానించారు. గజేందర్ మాట్లాడుతూ.. మహేందర్కు రాష్ట్ర స్థాయి బాధ్యతలు రావడం నియోజకవర్గానికి గర్వకారణం అన్నారు. దళిత సమాజం అభివృద్ధికి తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు.
SRCL: సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. కరోనా సమయంలో కీలక సేవలు అందించిన తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు.
PDPL: ఎండ తీవ్రత దృష్ట్యా కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య కార్మికుల పని వేళలు సవరిస్తున్నట్లు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సోమవారం తెలిపారు. ఎండ బారిన పడకుండా నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 11 గంటల లోపు విధులు ముగించాలని అన్నారు. ఇటీవల వడ దెబ్బ బారిన వరుసమరణాలు సంభవిస్తుండడంతో పని వేళలు మార్చినట్టు తెలిపారు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో AI, & LIFE SKILLS 4 రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులకు నేడు (May 26) చివరి తేదీ అని తెలిపారు. ఆసక్తి గల వారు కరీంనగర్ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన జన భాగీదారి అభియాన్ విజయవంతమైందని కలెక్టర్ హరిత తెలిపారు. 241 గ్రామాల్లో 341 గ్రామ సభలు, 241 అవగాహన ర్యాలీలు నిర్వహించారు. 168 ఆరోగ్య శిబిరాల్లో సికిల్ సెల్, టీబీ, డయాబెటిస్ పరీక్షలు చేశారు. 1080 మందికి జాబ్ కార్డులు, ఆధార్ సేవలు అందించారు. గిరిజన అభివృద్ధికి పథకాలు సమర్థంగా అమలవుతున్నాయని తెలిపారు.
సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దీర్ఘకాలంగా నలుగుతున్న భూవివాదం ఒకరి ప్రాణం తీసేందుకు దారితీసింది. గ్రామానికి చెందిన మేకల జయరాం అనే వ్యక్తి సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమికి సంబంధించిన తగాదాల నేపథ్యంలోనే ప్రత్యర్థులు పథకం ప్రకారం జయరాంపై దాడి చేసి హతమార్చారని తెలిపారు.
NZB: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మైనారిటీ సెల్ జిల్లా, నగర ఛైర్మన్ పదవుల భర్తీకి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మైనారిటీ సెల్ జిల్లా అబ్జర్వర్ మొహమ్మెద్ మోయిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్ని నియోజకవర్గాలు, డివిజన్ల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయన్నారు.
NLG: భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవనంలో సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు.
MNCL: సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన నాణ్యత గల వైద్యం అందించడమే సింగరేణి లక్ష్యమని మందమర్రి ఏరియా జీఎం రామకృష్ణ అన్నారు. ఏరియా మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో ఆయన మాట్లాడారు. కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
KNR: న్యాయవాది ఖాజా మొహినోద్దీన్ హత్య ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. హత్యకు కారణమైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని వారు కోరారు.
SRCL: రుద్రంగి మండలం పరిధిలోని బడితండా గ్రామంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గడ్డివాములు, కట్టెలు, చెట్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
JGL: మేడిపల్లి మండలం కొండాపూర్లో దశాబ్ది సంపద వనాలు పథకంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ, నాయకులు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. 846 మొక్కలు నాటినట్లు రికార్డుల్లో చూపించినప్పటికీ స్థలంలో సుమారు 100 మొక్కలే ఉన్నాయన్నారు. రీప్లేస్మెంట్ పేరుతో లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు చూపించారని ఆరోపించారు. ఈ మేరకు విచారణ జరపాలన్నారు.
PDPL: రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిని మేయర్ మహంకాళి స్వామి సోమవారం సందర్శించారు. వడదెబ్బ బాధితులను పరామర్శించారు. ఆసుపత్రిలో ఫ్యాన్లు, కూలర్లు పనిచేయకపోవడం, వైద్యుల గైర్హాజరీపై రోగులు మేయర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన, బాధితులకు నిరంతరం వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాల కొరతపై పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించారు.