NLG: మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లికి చెందిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కన్నెకంటి రంగయ్య (108) మృతి పట్ల సీపీఎం జిల్లా కమిటీ తీవ్ర సంతాపం తెలిపింది. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికారి మల్లేశం, నారి ఐలయ్య, వెంకటేశ్వర్లు, బండ శ్రీశైలం, నాగార్జున, ప్రభావతి సంతాపం తెలిపారు.
GDWL: గ్రూప్-1 పరీక్షలను తిరిగి నిర్వహించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం అయిజ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పరీక్షలో అవకతవకలు జరగడం వల్ల అభ్యర్థులు అసంతృప్తిలో ఉన్నారన్నారు.
NLG: మునుగోడులోని సెయింట్ జోసెఫ్ ప్రైవేటు పాఠశాల బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని DYFI మండల కమిటీ MEOకు వినతిపత్రం అందజేసింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమని జిల్లా సహాయ కార్యదర్శి లింగస్వామి హెచ్చరించారు. అధిక ఛార్జీలు వసూలు చేయడంతో పాటు సుదీర్ఘ ప్రయాణాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ మండలంలో నిర్వహిస్తున్న డ్రైడే – ఫ్రైడే కార్యక్రమాలపై జడ్పి సీఈవో ఎల్లయ్య సమీక్ష నిర్వహించారు. ఇవాళ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సతీష్ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రతి శుక్రవారం డ్రైడే – ఫ్రైడే కార్యక్రమాలు చేపట్టి, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
KMM: ఉద్యోగ విరమణ పొందినవారికి రెండు పెన్షన్లను తొలగించడం చాలా బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య విమర్శించారు. రాజకీయ పదవులను అనుభవించేవారికి రెండు పెన్షన్లు ఎందుకని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
WGL: పట్టణ కేంద్రంలో ఇవాళ AISF జిల్లా కార్యదర్శి లాదెళ్ల శరత్ ఆధ్వర్యంలో ఆర్డీవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. శరత్ మాట్లాడుతూ.. వర్షాల వల్ల శిథిలావస్థలోని హాస్టల్ భవనాలు కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం త్వరగా స్పందించి కొత్త భవనాలు నిర్మించాలని కోరారు. AISF నేతలు ఉన్నారు.
MBNR: యూరియా ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు వచ్చిన 600 మెట్రిక్ టన్నుల యూరియాను అన్ని ప్రాంతాలకు సరఫరా చేయాలన్నారు.
WGL: నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో మిగిలిన మొదటి సంవత్సరం సీట్ల కోసం దోస్తు ద్వారా స్పాట్ ప్రవేశాలకు అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తెలిపారు. మిగిలిన సీట్ల వివరాలు గ్రూపుల వారీగా దోస్తు వెబ్సైట్లో ఉన్నాయని, సెప్టెంబర్ 15, 16 తేదీల్లో విద్యార్థులు కళాశాలలో అప్లికేషన్లు సమర్పించాలని సూచించారు.
SRD: టూర్ ప్యాకేజీకి ఆర్టీసీ యాత్రదానం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని ఖేడ్ RTC, DM మల్లేశం నేడు తెలిపారు. సొసైటీ, NGOS స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ వంటి దాతలు ముందుకొచ్చి, స్కూల్ చిల్డ్రన్స్, అనాథలు, పేద వృద్ధుల విహారయాత్రకు స్పాన్సర్గా బస్సులను బుకింగ్ చేయించలన్నారు. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు.
సంగారెడ్డి: బీజేపీ సీనియర్ నాయకుడు దోమడుగు రమేష్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసి, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శుక్రవారం జిన్నారం మండలంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమేష్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
WGL: జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఇవాళ ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ పరిశీలించారు. నిర్మాణాలను వేగవంతం చేస్తేనే బిల్లులు వెంటనే మంజూరవుతాయని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
SDPT: గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు నూతన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ చిత్రపటాన్ని సబ్బు బిళ్లపై అద్భుతంగా చిత్రీకరించారు. ఇవాళ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ అరుదైన కళాఖండంతో నూతన ఉపరాష్ట్రపతికి తన అభినందనలు తెలిపారు.
MBNR: ప్రస్తుత సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యారంగాన్ని మారుస్తున్న శక్తివంతమైన సాధనమని పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య జీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోధన అభ్యాసం పరిశోధన పరిపాలన అంశాలపై AI ప్రభావం పడుతుందన్నారు.
NZB: జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం ఈ నెల 16న ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లో జరుగుతుందని డీఆర్డీవో సాయాగౌడ్ తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న వివిధ పథకాలపై చర్చిస్తారని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.
JGL: అనారోగ్య కారణంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంఘ శరత్ కుమార్ (23) సంవత్సరం నుంచి ఛాతిలో నొప్పితో బాధ పడుతుండేవాడు. పలుమార్లు ఆస్పత్రికి వెళ్లినా నొప్పి తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.