• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అంధ్ర క్రీడాకారుడుని అభినందించిన మంత్రి

WNP: ఆత్మకూరులో శిక్షణ పొందిన అంధ్ర విద్యార్థి పవన్ కళ్యాణ్ ఇండియా గోల్ బాల్ భారత జట్టుకు ఎంపిక కావడంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఆదివారం క్రీడాకారుడుని అభినందించారు. అంధ్రుడు అయినా తన ప్రతిభతో జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఆధిరోహించాలని ఆకాంక్షించారు.

July 6, 2025 / 08:16 PM IST

ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందిన పర్వతగిరి వాసి

WGL: ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదులో ప్రొఫెసర్‌గా పర్వతగిరి మండలం కొంకపాక చెందిన భూక్య తిరుపతి పదవి బాధ్యతలు స్వీకరించడం పట్ల ఆదివారం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు అచించలమైన కృషి పట్టుదల విశ్వాసంతో ముందుకు నడిచి ప్రొఫెసర్‌గా ఎదిరిన తీరు పట్ల ఇక్కడి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

July 6, 2025 / 08:07 PM IST

రేపు హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు

HNK: హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరుగు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరిశ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో జరుగు స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు.

July 6, 2025 / 07:42 PM IST

మెండోరా ఎస్సైగా జాదవ్ సుహాసిని

NZB: మెండోరా మండల ఎస్సైగా జాదవ్ సుహాసిని ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మెండోరా ఎస్సైగా ఉన్న యాసర్ అర్ఫాత్ నిజామాబాద్ కమిషనరేట్ వీఆర్‌కు బదిలీ అయ్యారు. ట్రైనీ ఎస్సైగా ఉన్న సుహాసినికి మెండోరా బాధ్యతలు అప్పగించారు. మే 1న బాధ్యతలు చేపట్టిన అర్ఫాత్ కేవలం రెండు నెలల్లోనే బదిలీ కావడం గమనార్హం.

July 6, 2025 / 07:39 PM IST

ఘనంగా మొహర్రం వేడుకలు

MDK: పెద్ద శంకరంపేట మండలంలో ఆదివారం మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద శంకరంపేటలో దూది పీర్, లాల్ సాబ్, చాన్ సాబ్, మౌలాలి పీర్లను పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ప్రజలు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

July 6, 2025 / 07:18 PM IST

ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని రుక్మిణి విఠలేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విఠలేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

July 6, 2025 / 07:16 PM IST

పెద్ద శంకరంపేటలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి

MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో మండల అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడిన మహోన్నత వ్యక్తి ఆయన అని కొనియాడారు.

July 6, 2025 / 07:14 PM IST

మైనారిటీ హక్కుల కోసం ఆవాజ్ చైతన్య యాత్ర

GDWL: గట్టు మండలంలో ఆవాజ్ కమిటీ చైతన్య యాత్ర ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతికూర్ రహ్మాన్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులు హరించబడుతున్నాయని,పేదరికం, నిరుద్యోగం, మత విద్వేషాలతో నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 13-14న గద్వాలలో ఆవాజ్ మహాసభలు, ర్యాలీ, బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.

July 6, 2025 / 05:24 PM IST

రైలులో నుంచి జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలు

GDWL: రైలు డోర్ వద్ద నిద్రమత్తులో జారిపడటంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి తిరుపతికి స్నేహితులతో కలిసి రైలులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని నవాబ్‌పేట్ మండలం కారుకొండ గ్రామానికి చెందిన నరేందర్ (48)గా గుర్తించారు.

July 6, 2025 / 05:18 PM IST

జూరాలకు ప్రాజెక్ట్ 12 గేట్లు ఎత్తివేత

GDWL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 4 గంటల సమయానికి ప్రాజెక్టుకు 1,10,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరిందని అధికారులు తెలిపారు. దీంతో, ప్రాజెక్టులోని 12 గేట్లు ఎత్తి 1,11,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

July 6, 2025 / 05:16 PM IST

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

MDK: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని నర్సాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. నర్సాపూర్ మండలం అజమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు.

July 6, 2025 / 05:15 PM IST

‘విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలి’

ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి ZPSS పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సంజన, శిరీష, శ్రీజ IIITకి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఉద్యోగ బృందం సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు వికేష్ కుమార్, చంద్రకాంత్, సుభాష్, సాయి చరణ్ తదితరులున్నారు.

July 6, 2025 / 05:11 PM IST

ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

SRCL: ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ 124వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు సౌల క్రాంతి ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆలోచన విధానంలో ఆయన ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తామన్నారు.

July 6, 2025 / 05:04 PM IST

గుట్కా, అంబర్ విక్రయిస్తే కఠిన చర్యలు: సీఐ

HNK: గుట్కా, అంబర్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ సీఐ శివ కుమార్ అన్నారు. నయీంనగర్‌లోని ఓ కిరాణ షాపులో పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రూ. 4,500 విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిందితుడు మహేందర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

July 6, 2025 / 04:33 PM IST

భద్రకాళి ఆలయంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

WGL: భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.

July 6, 2025 / 04:27 PM IST