NGKL: వెల్దండ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిపై నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కృష్ణయ్య తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 75 ఇండ్ల గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని.. ఈ సమావేశానికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు.