TG: బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి సున్నా నిధులు కేటాయించడం బాధకరమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. గత ఏడాది బడ్జెట్కు, ఈ బడ్జెట్కు పెద్ద తేడాలేదని విమర్శించారు. GHMCని మూడు ముక్కలుగా విడగొట్టారని మండిపడ్డారు. అసలు నిధులు కేటాయించకపోతే.. HYD అభివృద్ది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. విద్యాశాఖకు 8 శాతం నిధులే కేటాయించారని ధ్వజమెత్తారు.