NLG: కట్టంగూర్ మండలం ఎరసానిగూడెం గ్రామానికి చెందిన కడారి శివాజీ యాదవ్(18) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ శివాజీ మృతదేహానికి నివాళులర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.