PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన సుంచు మల్లేశం సామాజిక సేవకు గాను ఇటీవల డాక్టర్ అంబేద్కర్ జాతీయ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఇవాళ ధర్మారంలో అఖిలపక్ష నాయకులు ఆయనను అభినందించి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెరిక బానేష్ చొప్పదండి మల్లేశం, బొల్లి నందయ్య, అమరపల్లి నారాయణ, కూరపాటి శ్రీనివాస్, నూనె వెంకట నర్సు తదితరులు పాల్గొన్నారు.