GDWL: రేపు ఉగాది పండుగను పురస్కరించుకుని శాంతినగర్ లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకుడు వినయ్ కౌశల్ తెలిపారు. వేకువజామున అమ్మవారికి అభిషేకం, అర్చన, మహా మంగళహారతితో పాటు పంచాంగ శ్రవణం, గోమాత పూజ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.