ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో SP నితిక పంత్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలను విని, చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, ఎలాంటి పైరవీలు లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలన్నారు.