పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం దుమారం రేపుతోంది. ఈ క్రమంలో మాజీ IPL ఛైర్మన్ లలిత్ మోదీ.. కావ్య మారన్కు Xలో ఓ సలహా ఇచ్చాడు. ‘పాక్ ఆటగాడిపై రూ.2.34 కోట్లు పెట్టుబడి పెట్టడంతో ఫ్యాన్స్ ఒకరకమైన ఇదితో ఉన్నారు కదా? ఇలాంటి సమయంలో ఇమేజ్నే మేనేజ్ చేసుకోవడం ఎలాగో నాకు తెలుసు. నాకు కాల్ చెయ్’ అని పేర్కొన్నాడు.