BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి మండలం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు చదివించిన ఆయన, వారి పఠన సామర్థ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను ఈ సందర్భంగా హెచ్చరించారు.