MBNR: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 19 నుంచి 28 వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, 28న శ్రీరామ నవమి వేడుకలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 29న శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు.