HYDలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు కీలకమైన తరుణంలో అనవసర చర్చలు, పర్సనల్ చిట్చాట్లు వద్దని గట్టిగా హెచ్చరించారు. సభకు పూర్తి సన్నద్ధతతో హాజరుకావాలని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. సీఎం ఈ వ్యాఖ్యలతో సమావేశంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.