KNR: జమ్మికుంట పట్టణంలోని 3వ వార్డు రామన్నపల్లిలో మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో నూతన వైకుంఠధామం ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేపట్టారు. రామన్నపల్లిలో పెరుగుతున్న జనాభా కారణంగా దహన సంస్కారాలకు సరైన స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఛైర్మన్ కౌన్సిలర్లు, వార్డు ప్రజలతో కలిసి అనువైన స్థలాన్ని పరిశీలించారు.