MDK: తూప్రాన్ పట్టణ శివారులోని అయ్యప్ప ఆలయం వద్ద 33 కేవీ విద్యుత్తు లైనులపై భారీ వృక్షం పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో ఎండిపోయిన చెట్టు విరిగి విద్యుత్ లైన్ పై పడింది. దీంతో ఇస్లాంపూర్ సబ్ స్టేషన్ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏఈ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెట్టు తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.