గ్యాస్ స్ట్రబుల్ ఎక్కువగా వచ్చే వాళ్లు వేగంగా తినడం మానేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. భారీగా ఒకేసారి తినడం కంటే రోజులో చిన్న చిన్న మోతాదులో తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం తిన్న వెంటనే పడుకోకుండా కనీసం కొద్దిసేపు నడవాలి. టీ, కాఫీ ఎక్కువగా తాగడం తగ్గించాలి. బంగాళాదుంప, క్యాబేజీ, బీన్స్ లాంటి గ్యాస్ పెంచే పదార్థాలు పరిమితిలోనే తీసుకుంటే కడుపు ప్రశాంతంగా ఉంటుంది.
చర్మ సౌందర్యానికి శనగపిండి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధం. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, రంగును మెరుగుపరుస్తుంది. శనగపిండిలో పెరుగు కలిపి రాస్తే అధిక జిడ్డు తగ్గుతుంది. లేదా శనగపిండిలో చిటికెడు పసుపు, పాలు కలిపి ప్యాక్లా వేస్తే చర్మం మెరుస్తుంది. అంతేకాదు శనగపిండిలో నిమ్మరసంతో కలిపి వాడితే ట్యాన్ తొలగిపోతుంది.
బార్లీ వాటర్తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి చలవ చేసి ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడమే కాకుండా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులోని పీచు పదార్థం బరువు తగ్గడానికి, మలబద్ధకం దూరం చేయడానికి తోడ్పడుతుంది. అలాగే కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనాల్స్ నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రేరేపించి రక్తనాళాలను సడలింపజేస్తాయి. దీని ద్వారా రక్తపోటు తగ్గుతుంది. కోకోలో ఉండే ప్రతి ఆక్సీకరణ పదార్థాలు రక్తనాళాల గోడలను, కొవ్వు అణువులను ఆక్సీకరణ నష్టానికి గురికాకుండా రక్షిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి.
TG: రాష్ట్రంలో HPV వ్యాక్సినేషన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 14 ఏళ్లు నిండిన బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అయితే భారత్లో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ అనేది రెండో అత్యంత సాధారణ క్యాన్సర్గా ఉంది. ఈ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ దీర్ఘకాలికంగా శరీరంలో ఉండటం వల్ల వస్తుంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం HPV వ్యాక్సిన్ను ఉపయోగిస్తోంది.
ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందులో పాలకూర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆకుకూర. వారానికి ఒక్కసారైనా తింటే అనేక లాభాలు కలుగుతాయి. నీరసంగా అనిపిస్తే, పాలకూర తినాలి. కంటి చూపు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం, రక్తపోటును నియంత్రిస్తుంది. అయితే, పాలకూరను మరీ ఎక్కువగా ఉడికించొద్దు.
వీరాసనం మోకాళ్లు చీలమండలు, తొడలను బలోపేతం చేస్తూ జీర్ణక్రియను మెరుగుపరిచి వెన్నుముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణ అవయవాలకు రక్తప్రసరణను పెంచి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నడుము దిగువ భాగంలో నొప్పిని తగ్గిస్తుంది. ఇది ధ్యానానికి అనుకూలమైన భంగిమ కాబట్టి ఏకాగ్రతను పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. దిగువ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
కొలంబో వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్కు చేరగా.. రెండో బెర్త్ కోసం కివీస్కి ఇందులో విజయం తప్పనిసరి. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడితే.. ఆ టీమ్ సెమీస్ ఆశలన్నీ లంక-పాక్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటాయి.
శరీర భాగాల ఆకృతిని బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెద్ద చెవులు ఉన్నవారు ఆత్మవిశ్వాసం, నిజాయితీ కలిగి ఉండి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని వివరిస్తున్నారు. చిన్న చెవులు ఉన్నవారు లోతైన ఆలోచనాపరులై, క్రమశిక్షణతో లక్ష్యం వైపు దూసుకుపోతారని అంటున్నారు. ఇలా చెవుల ఆకృతిని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
జీలకర్ర జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి మరిగించి, ఆ కషాయాన్ని తాగితే కడుపులో గ్యాస్ సమస్యలు వెంటనే మాయమవుతాయి. జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా అవసరం. వేసవిలో శరీర వేడిని తగ్గించడానికి జీలకర్ర పొడిని మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా లభిస్తుంది.
మిరియాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు అత్యుత్తమ మందు. మిరియాల పొడిని నెయ్యితో లేదా తేనెతో తీసుకుంటే మొండి దగ్గు, గొంతులో పేరుకుపోయిన కఫం కరిగిపోతాయి. ఇందులో ఉండే ‘పైపెరిన్’ అనే పదార్థం మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. మిరియాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. తలనొప్పి ఉన్నప్పుడు మిరియాల కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది.
కడుపు నొప్పి లేదా అజీర్తితో బాధపడుతున్నప్పుడు వామును మించిన మందు మరొకటి లేదు. అర చెంచా వామును కొంచెం ఉప్పుతో కలిపి నమిలి గోరువెచ్చని నీరు తాగితే ఐదు నిమిషాల్లో ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు కడుపులో గ్యాస్ ఏర్పడినప్పుడు వాము నీటిని ఇస్తే చాలా మంచిది. వాము ఆస్తమా రోగులకు కూడా మేలు చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు వాము నూనెతో మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది.
మామిడి పండ్లు తింటే షుగర్ పెరగడం పక్కన పెడితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు సరైన పద్ధతిలో మామిడి తింటే అది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని తేలింది. రోజుకు 250 గ్రాముల కంటే ఎక్కువ మామిడి పండును తీసుకోకూడదు. బిర్యానీలు లేదా స్వీట్లు తిన్న తర్వాత మామిడి పండు తింటే మాత్రం షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.
లిప్స్టిక్ వాడకం నేటి ట్రెండ్లో భాగమైనప్పటికీ, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని సీసం, కాడ్మియం వంటి భారలోహాలు దీర్ఘకాలంలో శరీరంలో చేరి ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, రసాయనాలు లేని ఆర్గానిక్ లేదా నాన్-టాక్సిక్ ఉత్పత్తులనే ఎంచుకోవడం ఉత్తమం.