ఒత్తయిన జుట్టు కోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్డులోని తెల్లసొన కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. 10గంటలు నీటిలో నానబెట్టిన మెంతులను పేస్ట్లా చేసుకుని జుట్టుకు అప్లై చేసి 30-40నిమిషాల తర్వాత కడగాలి. సహజసిద్ధంగా తయారుచేసిన ఉసిరి, శీకాకాయ పొడులను వాడాలి. ఉల్లిరసం, కలబంద, ఆముదం వంటి వాటితో కుదుళ్లను మర్దన చేయాలి.
పరగడుపున కొబ్బరినూనెతో పుక్కిలించడం వల్ల వ్యర్థాలు తొలగిపోతాయి. ఫ్రిజ్లో పెట్టిన టీ బ్యాగులను కళ్లపై పెట్టుకోవడం వల్ల ట్యాన్, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. ఒక టీ స్పూన్ చక్కెర నోట్లో వేసుకుని చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి. ఉల్లిగడ్డ రసాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు ఉంచితే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. దంతాలు పసుపు పచ్చగా ఉన్నవారు రోజుకో యాపిల్ తింటే మంచిది.
నమ్మకూడని వారిని నమ్మడం ఎంత ప్రమాదమో.. మిత్రుడిని అతిగా నమ్మడం కూడా అంతే ప్రమాదమని విదురుడు హెచ్చరించాడు. ఒకవేళ భవిష్యత్తులో ఆ మిత్రుడితో వైరం వస్తే.. మీ రహస్యాలన్నీ బయటపెట్టి, మీ పతనానికి కారణమవుతాడు. అందుకే స్నేహంలో కూడా ఓ కంట కనిపెడుతూ, రహస్యాల విషయంలో ఒక హద్దులో ఉండటమే మంచిది.
ఒక పేద కట్టెలు కొట్టుకునే వ్యక్తి గొడ్డలి పొరపాటున నదిలో పడిపోయింది. నదీ దేవత ప్రత్యక్షమై బంగారు, వెండి గొడ్డళ్లు చూపించినా, అతను తన ఇనుప గొడ్డలే కావాలని నిజాయితీగా చెప్పాడు. అతని నిజాయితీకి మెచ్చిన దేవత మూడు గొడ్డళ్లను బహుమతిగా ఇచ్చింది.నీతి: కష్టకాలంలో కూడా నిజాయితీగా ఉంటే, ఆ దైవమే మనల్ని కాపాడుతుంది.
అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమ పువ్వు ఒకటి. ఇది ఎక్కువగా ఇరాన్, గ్రీస్, మొరాకో, స్పెయిన్, కశ్మీర్, ఇటలీలో ఉత్పత్తి అవుతుంది. కుంకుమపువ్వును వాడటం వల్ల శరీరానికి మేలు కలుగుతుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, జ్వరం వంటి వాటితో బాధపడే వారికి పాలల్లో కలిపిన కుంకుమపువ్వును నుదిటిపై రాయాలి. ఇలా చేయడం వల్ల ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే వారు ఆరు దుర్గుణాలను తక్షణమే వదిలేయాలని విదుర నీతి చెబుతోంది. మనిషి పాలిట శత్రువులైన ఆ ఆరు లక్షణాలు ఇవే: అతి నిద్ర, మత్తు/సోమరితనం, భయం, కోపం, బద్ధకం సహా వాయిదా వేసే గుణం. ఈ ఆరు లక్షణాలు మనిషి ప్రగతికి, విజయానికి అడ్డుపడే ప్రధాన అవరోధాలు. వీటిని జయించిన వారు మాత్రమే జీవితంలో గొప్ప విజయాలను, కీర్తిని సాధించగలరు.
భుజంగాసనం వల్ల భౌతిక పరంగానే కాకుండా అంతర్గత శరీర అవయవాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వల్ల అంతర్గత అవయవాలను ఉత్తేజానికి గురిచేసి, జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తుంది. పొట్ట చుట్టు ఉన్న కొవ్వు సులభంగా తగ్గిపోతుంది. నిత్యం భుజంగాసనం వేయడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాలపై ఒత్తిడి పెరిగి, కొవ్వు కరిగిపోతుంది.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆహారాన్ని పూర్తిగా నమలకకుండా గబగబా లాగించేస్తుంటారు. ఇది మంచిది కాదని, ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా శరీరానికి పోషకాలు, శక్తి అందకపోవడే కాక బరువు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా కడుపు నిండినా ఆకలి తీరదంటున్నారు. పూర్తిగా నమిలి తింటే శరీరానికి సత్వర శక్తితో పాటు దవడలకూ మేలు జరుగుతుందట.
టైప్ 2 డయాబెటిస్తో బాధపడేవారు అవకాడో తింటే మంచి ఫలితం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు.. బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, ఓట్స్ మీల్స్, తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. చక్కెర పానీయాలు, మద్యం, జంక్ ఫుడ్ వంటి పదార్థాలను వారు తినకూడదు.
ఆత్మజ్ఞానం, కార్యసాధనలో సామర్థ్యం, ఓర్పు, ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకపోవడం… అనే ఈ లక్షణాలు ఎవరినైతే తమ లక్ష్యం (పురుషార్థం) నుంచి పక్కకు మళ్లించవో, వారినే నిజమైన ‘పండితులు’ అని అంటారు. దుర్యోధనుడి వంటి వారికి ఈ లక్షణాలు లేవని విదురుడు స్పష్టం చేశాడు.
ఉత్కటాసనం చేయడం వల్ల తొడలు, పిరుదులు, కాళ్లు, వెన్నెముక, భుజాలు, చేతులు వంటి భాగాలను బలపరుస్తుంది. పొట్టలోని అవయవాలను ఉత్తేజపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఛాతీ, డయాఫ్రమ్ను తెరుస్తుంది. శ్వాసక్రియను, నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి శక్తినిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు తమ చర్మంపై ఏర్పడే అధిక నూనెని కవర్ చేసుకోవడానికి తరచూ పౌడర్ వాడతారు. కానీ ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. పౌడర్ చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల మొటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. అందుకే పౌడర్ వాడటం కంటే సహజమైన ఉత్పత్తులను ఉపయోగించి జిడ్డుదనాన్ని తగ్గించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
విదురుడి ప్రకారం నలుగురికి నిద్రపట్టదు. 1. తనను కాపాడుకోవడానికి తగిన ఆయుధాలు లేని సమయంలో బలవంతుడు దండెత్తితే ఆ బలహీనుడికి, 2. సర్వస్వం కోల్పోయిన వాడికి, 3. కామంతో రగిలిపోయే వాడికి, 4. దొంగకు.. రాత్రిళ్లు నిద్ర ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక ఆందోళనతో మేల్కొనే ఉంటారు.
చక్రాసనం (వీల్ పోజ్) చేయడం వల్ల వెన్నెముక బలోపేతమవుతుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాళ్లను దృఢంగా చేసి, నడవడం, పరిగెత్తడం వంటి పనులను సులభతరం చేస్తుంది. పొత్తికడుపు కండరాలపై ఒత్తిడిని పెంచి, కొవ్వును కరిగిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. చేతులు, భుజాలు, కాళ్ల కండరాలను బలపరుస్తుంది.
మద్యం సేవిస్తే చలి తగ్గుతుందని చాలా మంది అపోహపడుతుంటారు. కానీ ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లగానే రక్తనాళాలు వ్యాకోచించి, రక్తం.. చర్మం ఉపరితలానికి చేరుతుంది. దాంతో మనకు పైకి వేడిగా అనిపించినప్పటికీ.. శరీరంలోని అంతర్గత వేడి బయటకు వెళ్ళిపోతుంది. దాని వల్ల చలిని తట్టుకునే శక్తి తగ్గి ‘హైపోథెర్మియా’ వంటి ప్రమాదాలు వస్తాయి. కాబట్టి చలి తగ్గాలంటే వేడి పానీయాలు తీసుకోవడం మంచిది.

