• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

వేడి నీళ్లు vs చన్నీళ్లు.. పొద్దున్నే ఏవి తాగాలి?

పొద్దున లేచిన వెంటనే ఓ గ్లాస్ నీరు తాగాలని వైద్యులు తరచూ చెబుతుంటారు. ఈ క్రమంలో వేడి నీళ్లు, చన్నీళ్లలో ఏవి బెటర్ అంటే.. వేడి నీళ్లు జీర్ణక్రియ, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. డిటాక్సిఫికేషన్ చేస్తాయి. అదే చన్నీళ్లు అయితే క్యాలరీలు కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. అలాగే రిఫ్రెషింగ్ ఫీల్‌తో పాటు బాడీని హైడ్రేట్ చేస్తాయి. ఇలా అవసరాన్ని బట్టి ఏ నీరైనా తాగొచ్చు.

November 23, 2025 / 06:27 AM IST

గోధుమ గడ్డి రసంతో ప్రయోజనాలు

గోధుమ గడ్డి రసంలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ రసంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. బరువు, రక్తపోటును తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. గాయాలను త్వరగా మానిపిస్తుంది.

November 23, 2025 / 06:27 AM IST

తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా?

ప్రస్తుత జీవనశైలి వల్ల కొందరు తరచూ స్నానానికి ముందే తింటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే పేగుల ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా మార్పులు కలిగి జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం పడుతుందని, దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కడుపు తిమ్మిరి కూడా కలుగుతుందని, స్నానం తర్వాతే తినాలని సూచిస్తున్నారు.

November 22, 2025 / 08:25 PM IST

డ్రాగన్ ఫ్రూట్‌తో ఇన్ని లాభాలా?

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత కూడా తగ్గుతుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఎముకలను దృఢంగా ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉండటానికి కూడా ఇది తోడ్పడుతుంది.

November 22, 2025 / 07:45 PM IST

చామ దుంప‌ల‌ను తిన‌డం లేదా..?

చామ‌ దుంప‌ల జిగురుగా ఉంటాయని చాలా మంది తినరు. కానీ వీటిలో ఉండే ఫైబర్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, హైబీపీతో ఇబ్బంది పడుతున్నావారికి మంచి ఫలితాన్ని అందిస్తుంది.

November 22, 2025 / 03:58 PM IST

ఆ సమస్యలు ఉంటే.. క్యాలీఫ్లవర్‌ జోలికి వెళ్లొద్దు!

ప్రతి రోజూ క్యాలీఫ్లవర్‌ తినడం కొంతమందికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ వినియోగాన్ని తగ్గించాలి. క్యాలీఫ్లవర్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను పెంచుతాయి. అలాగే, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటే క్యాలీఫ్లవర్ తినొద్దు. గాల్ బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఉన్నట్లయితే క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.

November 22, 2025 / 01:15 PM IST

మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా?

ఉప్పును అధికంగా తింటే శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తనాళాల గోడలపై ఒత్తిడి పడుతుంది. దీంతో రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. మీకు బీపీ ఉన్నట్లుండి సడెన్‌గా పెరిగి అది అలాగే కొనసాగుతూ ఉంటే మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారేమో పరిశీలించండి. ఉప్పును తక్కువగా తీసుకోండి. లేదా కొన్ని రోజులు మానేయండి. దీంతో బీపీని ఆరంభంలోనే తగ్గించుకోవచ్చు.

November 22, 2025 / 11:53 AM IST

నిమిషం ‘వాల్ సిట్’తో అద్భుత ప్రయోజనాలు

రోజుకు కేవలం ఒక్క నిమిషం గోడ కుర్చీ(Wall Sit) వ్యాయామంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. నడుమును గోడకు ఆనిచ్చి మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో ఉండేలా కూర్చోవాలి. పాదాలు పూర్తిగా నేలపై ఉండాలి. ఈ వ్యాయామం వల్ల కాళ్ల కండరాలు బలోపేతమవుతాయి. శరీరంలో అదనపు కొవ్వు కరుగుతుంది. రక్తపోటు(Blood Pressure) నియంత్రణలో ఉంటుంది. ఈ సులభమైన వ్యాయామం శరీరానికి బలాన్నిస్తుంది.

November 22, 2025 / 10:58 AM IST

చలికాలంలో మార్నింగ్ వాక్ వెళ్తున్నారా?

ఆధునిక జీవనశైలిలో నడక తప్పనిసరి. అయితే శీతాకాలంలో చల్లని గాలిలో నడవడం సురక్షితమేనా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. ఆస్తమా, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు చల్లని గాలిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. నడకను నెమ్మదిగా మొదలుపెట్టాలి. శరీరం చల్లబడకుండా చేతులు, కాళ్లు కప్పి ఉంచాలి. గొంతు/ఊపిరితిత్తుల రక్షణకు నీరు తాగుతూ, అవసరమైతే మాస్క్ ధరించాలి.

November 22, 2025 / 07:18 AM IST

సబ్జా గింజలను నానబెట్టి తింటే?

సబ్జా గింజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో నానితే మెత్తని జెల్ లాంటి పదార్థంలా మారుతాయి. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. సబ్జా గింజలను తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ గింజలు సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.

November 21, 2025 / 09:18 PM IST

ఈ సీజన్‌లో టమోటా సూప్ తాగితే?

చలికాలంలో టమోటా సూప్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టమోటాలలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. లైకోపీన్ వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ప్రోస్టేట్, లంగ్స్, జీర్ణాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. లైకోపీన్ వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

November 21, 2025 / 02:00 PM IST

అశ్వగంధతో ఒత్తిడి, ఆందోళనకు చెక్!

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందేందుకు రోజూ ఓ టీస్పూన్ అశ్వగంధ పొడి తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ఔషధ, పోషక గుణాలు సంతానోత్పత్తితో పాటు కండరాలు, ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయని అంటున్నారు. ఇందుకోసం అశ్వగంధను పాలు లేదా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

November 21, 2025 / 12:24 PM IST

చలికాలంలో పెరుగు తింటున్నారా?

చలికాలంలో పెరుగు తినడం వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయి. పెరుగును మితంగా తినడం వల్ల అజీర్తి, గ్యాస్, ఎసిటిడీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి శక్తి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎక్కువగా పెరుగు తింటే జలుబు, దగ్గు, ఆయాసం వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయట. రాత్రిపూట తింటే జీర్ణ సమస్యలు, అలెర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది.

November 21, 2025 / 10:47 AM IST

కేశ సంరక్షణకు చక్కని చిట్కాలు

శీతాకాలపు చల్లగాలుల కారణంగా జట్టు రాలడం, పొడిబారడం, చండ్రు వంటి కేశ సమస్యలు సహజం. వీటిని అధిగమించేందుకు..★ తలస్నానానికి ముందు నూనె, కండీషనర్ వాడండి★ తేలికపాటి షాంపూలనే వాడాలి★ వేడి నీళ్లకు బదులు గోరువెచ్చని నీరు ఉత్తమం★ డ్రయర్ల వాడకం తగ్గించి జుట్టును సహజంగా ఆరనివ్వాలి★ విటమిన్ A, E, జింక్, బయోటిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.

November 21, 2025 / 10:46 AM IST

మధ్యాహ్నం నిద్ర రాకుండా ఉండాలంటే..!

మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర ఆవహించడం చాలామందికి ఉండే సమస్య. దీన్ని అధిగమించాలంటే మధ్యాహ్నం తేలికపాటి ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు తగ్గించాలి. భోజనం చేశాక కనీసం 5-10 నిమిషాలు నడవండి. ఇది జీర్ణక్రియకు సహాయపడి, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. వీలైతే 15-20 నిమిషాల చిన్న కునుకు(Power Nap) తీసుకోండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది.

November 20, 2025 / 02:05 PM IST