ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్ ఒకటి. అయితే కొన్నిసార్లు సరైన సమయంలో పీరియడ్స్ రావు. ఇలా అవ్వడానికి జీవన శైలిలో చేసే పొరపాట్లే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి కారణంగా ఈ సమస్య వస్తుంది. ఇది పీరియడ్స్ చక్రాన్ని నిర్వహించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం కూడా ఇందుకు కారణమట. ఐరన్, విటమిన్ డి లోపం వల్ల సరైన సమయంలో పీరియడ్స్ రావు.
ప్రస్తుత కాలంలో పిల్లలు తినేటప్పుడు ఫోన్ ఎక్కువగా చూస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఫోన్ చూస్తూ తినడం వల్ల పోషకాహార లోపంతో పాటు ఊబకాయ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణక్రియ బలహీనపడుతుంది. కంటిపై ప్రభావం పడుతుంది. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పిల్లల పెరుగుదల, సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. మానసిక సమస్యలు తలెత్తుతాయి.
టిఫిన్ అనగానే చాలా మంది ఏదో ఒకటి తినేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ, బ్రేక్ఫాస్ట్లో పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే మొదట తీసుకునే ఆహారంలో పీచు(fibre) అధికంగా ఉండేలా చూసుకోవాలి. పీచు తర్వాత తప్పనిసరిగా తీసుకోవాల్సినవి మాంసకృత్తులు. వీటితో పాటు శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి.
బొప్పాయి ఆకుల జ్యూస్తో చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్ తాగితే మంచిది. గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు తగ్గుతాయి. మహిళల్లో రుతుక్రమ సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్, గుండె సమస్యలను ఇది నివారిస్తుంది.
చలికాలంలో అలోవెరా జెల్ చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా పెరుగు ఫేస్ ప్యాక్తో చర్యం మెరుస్తుంది. ముఖాన్ని నీళ్లతో కడిగిన తర్వాత ఈ ఫేస్ మాస్క్ను అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచాలి. అనంతరం నీటితో కడగాలి. అలోవెరా, ఆల్మండ్ ఆయిల్ ఫేస్ మాస్క్ వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలోవెరా, నిమ్మరసం ప్యాక్ చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది.
విశాఖ, అనకాపల్లి జిల్లాలో వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి ప్రమోషన్లు కల్పిస్తూ ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరిని కేజీహెచ్ సీఎస్ఆర్ఎమ్ఓగా బదిలీ చేశారు. జిల్లా డీఐఓ జీవన్ రాణిని విజయనగరం డీఎంహెచ్ఐగా పదోన్నతి కల్పించారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్లో రెండు ఖర్జూరాలు, గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మలబద్ధకం ఉండదు. జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం నుంచి ఉ...
ఒంగోలు నియోజకవర్గంలో 21 మందికి సీఎం సహాయనిధి నుంచి రూ.54 లక్షల మంజూరయ్యాయి. ఒంగోలులోని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రులలో వైద్యం పొందుతు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నవారికి వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తోందన్నారు.
VSP: పోర్టు హాస్పిటల్ లోపలికి ఎవరు వచ్చినా తరిమి కోడతామని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు అన్నారు. పోర్టు హాస్పిటల్ను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోర్టు హాస్పిటల్ వద్ద 82వ రోజు నిరసన దీక్ష వర్షం సైతం లెక్కచేయకుండా కొనసాగింది. 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం సరైనది కాదని తెలిపారు.
PPM: అనీమియా కేసులు ఇకపై ప్రతీ నెలా తగ్గుదల కొనసాగాలని వైద్యాధికారులు, ANM లకు పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేసారు. గర్భిణుల్లో రక్తహీనత ఉండకూడదని, కనీసం 11 శాతంకు తగ్గకుండా చూడాలని, లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహించిన, గర్భిణీలో రక్తహీనత ఉన్నట్లు నిర్ధారణ అయితే స్థానిక వైద్యాధికారి, ఏఎన్ఎం, అంగన్వాడీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
E.G: కె.గంగవరం మండలం ఊడిమూడిలో మెగా మెడికల్ క్యాంపును ఆదివారం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకుడు తాడాల వీర వెంకట సత్యనారాయణ శనివారం తెలిపారు. కాకినాడ, వైజాగ్ నుంచి డాక్టర్లు వస్తారని, సమీప గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ సంయుక్తంగా మెడికల్ క్యాంప్ ప్రారంభిస్తారన్నారు.
డ్రాగన్ ఫ్రూట్ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ తింటే 60 క్యాలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఆహారం. దీన్ని తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ జర్వం తగ్గుతుంది. ఈ పండు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వయస్సు మీద పడే వృద్ధ...
కొంతమంది ఫ్రిజ్లో పెట్టిన చికెన్ తింటారు. గడువు ముగిసిన చికెన్లో సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్, అతిసారం, వాంతులు, జ్వరం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే చికెన్ చెడిపోయి ఉంటే దాని రంగులో మార్పు కనిపిస్తుంది. దాన్ని గమనించాలి.
చలికాలంలో పెరుగు తింటే జలుబుతోపాటు గొంతునొప్పి, జ్వరం వస్తాయని, గొంతులో కఫం పేరుకుపోతుందని చెబుతుంటారు. కానీ ఇవన్నీ అపోహలే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో బ్యాక్టీరియాను ప్రోత్సహించడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో తింటే జలుబు, గొంతు నొప్పి, ఫ్లూవంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లని పెరుగు...
శీతాకాలంలో చలి తీవ్రతకు వేడివేడిగా ఆహారం తీసుకుంటారు. శరీరానికి వేడిని అందించి వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో మునగ సూప్ బెస్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఓ గిన్నెలో మునక్కాడ ముక్కలు, పావుకప్పు ఉల్లిపాయలు, వెన్న, చిన్న అల్లం ముక్క, కాస్త జీలకర్ర, ఉప్పు వేసి పాత్రలో సగానికిపైగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ నీళ్లు సగానికి అయ్యాక పెప్పర్ పౌడర్ చల్లుకుని తాగాలి. ఈ సూప్ నాడీవ్యవస్థను ఆరోగ...