ఉదయాన్నే అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన శక్తి తగ్గి, రోజంతా అలసటగా అనిపిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, ఏకాగ్రత దెబ్బతింటుంది. మెటబాలిజం మందగించి, మధ్యాహ్నం అతిగా తినే అవకాశం ఉంటుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి.
క్షమాగుణం ఉన్నవారిని చూసి ఈ సమాజం ‘బలహీనులు’, ‘చేతకానివారు’ అని తప్పుగా అర్థం చేసుకుంటుందని విదురుడు చెప్పాడు. కానీ క్షమించడం అనేది చేతకానితనం కాదు, అది బలవంతుడి అతిపెద్ద ఆభరణం. ఎదుటివారిని ఎదిరించే శక్తి ఉండి కూడా, కోపాన్ని అదుపు చేసుకుని క్షమించగలిగిన వాడే నిజమైన ధీరుడు. ఇతరులు ఏమనుకున్నా ఓర్పును వదులుకోకూడదని దీని సారాంశం.
సూర్య నమస్కారం కృతజ్ఞతతో కూడిన 12 ఆసనాల సమాహారం. ఉదయం ఖాళీ కడుపుతో తూర్పు ముఖంగా చేస్తే రక్త ప్రసరణ, జీర్ణక్రియ మెరుగుపడి, బరువు తగ్గుతారు. దీనితో పాటు 15 నిమిషాల ఉదయపు ఎండ వల్ల ఎముకలకు మేలు చేసే విటమిన్-డి అందుతుంది. ఇది రాత్రి పూట హాయిగా నిద్ర పట్టడానికి సహాయపడే మెలటోనిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
పళ్లు తోముకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. గట్టిగా, ఎక్కువ సేపు బ్రష్ చేస్తే పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. కేవలం 2 నిమిషాలు, మెత్తని బ్రిజిల్స్ ఉన్న బ్రష్తో సున్నితంగా తోముకోవాలి. నాలుకను శుభ్రం చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) బ్రష్ చేయాలి. ప్రతి 3 నెలలకోసారి బ్రష్ మార్చాలి. వాడిన తర్వాత బ్రష్ను శుభ్రంగా ఆరబెట్టాలి.
నిద్రలేవగానే అలారం ఆపి వెంటనే మంచం దిగకండి. కనీసం రెండు నిమిషాలు మంచంపైనే కూర్చోండి. అరచేతులను రుద్దుకుని కళ్లకు అద్దుకోండి. శరీరాన్ని నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి. వెంటనే లేవడం వల్ల రక్తపోటులో మార్పులు వచ్చి కళ్లు తిరిగే ప్రమాదం ఉంది. ఇలా నెమ్మదిగా మేల్కొనడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
దానిమ్మ పండును ‘పోషకాల గని’ అని పిలుస్తారు. ఇందులో విటమిన్ సి, కె, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు దీనిని తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి ముఖం మెరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ, చెడు కొలెస్ట్రాల్ను ఇది తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది.
వేసవికాలంలో పుచ్చకాయలు తినడం ఆరోగ్యానికి మంచిది. కానీ వాటిని కట్ చేసి ఫ్రిజ్లో పెట్టి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో పెట్టడం వల్ల తేమ, బ్యాక్టీరియా పెరుగుతాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలడం, అలర్జీలు వంటి సమస్యలు వస్తాయి.
కొన్ని రకాల కూరగాయలతో బెండకాయను కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే.. బంగాళదుంప, వంకాయ, ముల్లంగి, కాకరకాయ వీటితో పాటు పాలు, పెరుగు, టీ లేదా ఎర్ర మాంసం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచించారు.
గంటల తరబడి ఇయర్ఫోన్స్ వాడటం వల్ల చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇది క్రమంగా వినికిడి శక్తిని తగ్గిస్తుంది. హెడ్ ఫోన్స్ వాడేటప్పుడు వాల్యూమ్ ఎప్పుడూ 60% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకోసారి ఇయర్ఫోన్స్ తీసేసి, చెవులకు గాలి తగిలేలా 5-10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ముఖ్యంగా ఇయర్ఫోన్స్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
వెన్నునొప్పి, కండరాల ఒత్తిడిని తగ్గించడానికి ‘సాల్ట్ వాటర్ బాత్’ (ఉప్పునీటి స్నానం) అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, మనం వాడాల్సింది సాధారణ వంట ఉప్పు కాదు ‘ఎప్సమ్ సాల్ట్’. ఈ సాల్ట్ మెగ్నీషియం సల్ఫేట్తో తయారవుతుంది. గోరువెచ్చని నీటిలో కలిపి స్నానం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దెబ్బతిన్న కణజాలం త్వరగా కోలుకుంటుంది. శరీరంపై గురుత్వాకర్షణ ప్రభావం తగ్గుతుంది.
చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం నీళ్లతో సహా తీసుకుంటే రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా, ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను దృఢంగా మారుస్తాయి. మెరుగైన జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
బొప్పాయి మలబద్ధకానికి అద్భుతమైన ఔషధం. దీనిలోని ‘పాపైన్’ ఎంజైమ్ జీర్ణక్రియను వేగవంతం చేసి, ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లేదా బ్రేక్ఫాస్ట్లో కొన్ని బొప్పాయి ముక్కలు తింటే దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి ఇది తోడ్పడుతుంది.
ఇటీవల కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది గ్రీన్ టీ ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాగొద్దు. శరీరంలో ఐరన్ లోపం ఉన్నవారు గ్రీన్ టీ తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఉండే ‘టానిన్లు’ మొక్కల ఆధారిత ఆహారం నుంచి లభించే ఐరన్ గ్రహణ శక్తిని తగ్గిస్తాయి. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే, అది కాలక్రమేణా రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంది.
మార్జరి ఆసనం(పిల్లి భంగిమ) వెన్నెముకను సాగదీయడం, దాని సౌలభ్యాన్ని పెంచుతుంది. వెన్నునొప్పి, మెడ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం పొత్తికడుపు అవయవాలపై మసాజ్ లాగా పనిచేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత వెన్నునొప్పిని తగ్గించడానికి, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది.
చాలామంది ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగుతారు. కానీ అంతకంటే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహజసిద్ధమైన ‘డిటాక్స్’ ఏజెంట్లా పనిచేస్తుంది. అలాగే, జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.