• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »లైఫ్ స్టైల్

పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం..?

ఎక్కువ మంది తమ పిల్లలకు చాలా విషయాలు నేర్పిస్తున్నా.. ఆధ్యాత్మిక అంశాలు, అలవాట్లపై అవగాహన కల్పించడం లేదు. పిల్లలు ఇతరులతో ప్రేమతో నడుచుకునేలా అలవాటు చేయాలి. ధ్యానం, ఇంద్రియాలపై నియంత్రణ వంటి అంశాలను నేర్పించాలి. పిల్లలు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పించాలి. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించడం అలవాటు చేయాలి.

December 20, 2024 / 10:00 PM IST

భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు తింటే?

భోజనం చేసిన వెంటనే సోంపు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రోగాల నుంచి రక్షిస్తాయి. భోజనం చేసిన వెంటనే సోంపు గింజలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇది జీర్ణాశయ ఎంజైమ్‌లను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే, కడుపు ఉబ్బరం, అసిడిటీ సమస్యల నుంచ...

December 20, 2024 / 07:45 PM IST

చలికాలంలో నిమ్మరసం తాగితే..?

చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మరసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మరసం తాగడం వల్ల లివర్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు కరిగిపోతాయి. విష పదార్థాలు బయటకు వస్తాయి. లివర్ వ్యాధులు ఉన్నవారు నిత్యం నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. నిమ్మరసం తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది. కాంతివంతంగా మారుతుంది. చర్మానికి తేమ, మృదుత్వం లభిస్తాయి. దీంతో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

December 20, 2024 / 05:43 PM IST

‘అతి మంచితనంతో సమస్యలు’

అతి మంచితనం వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎదుటివారు ఇబ్బంది పడతారేమోనని అడిగిందల్లా చేయడం, ఏదైనా విషయంలో నో చెప్పలేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. తమను అందరూ మంచివారు అనుకోవాలనే ధోరణితో కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోరు. దీనివల్ల మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడం, మీపట్ల చులకనగా వ్యవహరించడం వంటివి చేస్తారు. అలాగే, అనవసర విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం కూడా మంచిది కాదని సూచ...

December 20, 2024 / 01:46 PM IST

వీటిని తినేముందు ఆలోచించండి..!

కొన్ని రకాల ఫుడ్స్ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అధిక చక్కెర శాతం ఉన్న చాక్లెట్స్‌ను తినకూడదని, శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని పేర్కొంటున్నారు. చిప్స్, బజ్జీలు, నూడుల్స్ వంటివి తింటే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని, పాస్తా, కేక్స్, వైట్ బ్రెడ్ వంటివి తినడం వల్ల చర్మంపై మచ్చలు, ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బర్గర్, పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ తింటే అనారోగ్య సమస్యలు వస్త...

December 20, 2024 / 10:32 AM IST

వేడి నీటితో స్నానం చేస్తున్నారా..?

వేడి నీటితో స్నానం చేయడం పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం సహజ తేమ తొలిగిపోయి.. చర్మం పొడిబారిపోతుంది. చికాకు, దురద, పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేస్తే.. గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంది. శరీరం బలహీనంగా మారుతుంది. తల తిరిగటం, డీహైడ్రేషన్, వికారం, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయట. శరీర ఉష్ణోగ్రత పెరిగి, బీపీ...

December 20, 2024 / 08:58 AM IST

చలికాలంలో నిమ్మరసం తాగితే ఎంతో మేలు

చలికాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ఈ సీజన్‌లో ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. సీజనల్ వ్యాధుల భారీనా పడకుండా ఉండాలంటే ప్రతి రోజు ఉదయం గోరువెచ్చటి నీటిలో అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉండటమే కాకుండా లివర్‌ను క్లీన్ చేస్తుందట. అలాగే మలబద్దకాన్ని దూరం చేయడంతో పాటు రోజంతా యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుందని నిపుణ...

December 20, 2024 / 06:36 AM IST

చలికాలం రాత్రి ఇలా పడుకుంటున్నారా..?

చలి నుంచి ఉపశమనం కోసం చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు సాక్సులు వేసుకుంటారు. సాక్సులు వేసుకోవడం వల్ల పాదాలు వెచ్చగా, హాయిగా ఉంటాయి. దీంతో నిద్ర హాయిగా పడుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. అయితే తడి సాక్సులు వేసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. సాక్సులు తడిగా ఉంటే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు పెరుగుతాయి. అందుకే చెమటతో తడిసిన సాక్సులు కూడా వేసుకోకూడదు.

December 19, 2024 / 09:26 PM IST

మనం అందుకే పుడుతున్నట్లా..?

ప్రస్తుతం భారతదేశంలో చాలా కంపెనీల్లో వారానికి 48 గంటల పనివిధానం ఉంది. వారానికి 6 రోజుల పని ఉంటే.. రోజుకు 8 గంటలు పనిచేస్తున్నట్లు. దీనికే ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. మరి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పినట్లు వారానికి 70 గంటలు అంటే రోజుకు 12 గంటలు పనిచేయాలి. మరి పర్సనల్ లైఫ్ ఏది? అంటే జీవితాంతం ఉద్యోగం చేయడానికి పుడుతున్నట్లా..? అని త్రినాథ్ బండారు అనే నిపుణుడు అంటున్నారు. మరి మీరేమంటారు..?

December 19, 2024 / 06:35 PM IST

మఖానాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

✦  షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.✦  జీర్ణశక్తి మెరుగుపడుతుంది.✦  శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.✦  గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది.✦  శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.✦  కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.✦  ఒత్తిడి, ఆందోళన దూరమవుతుంది.

December 19, 2024 / 03:16 PM IST

అందాన్ని తగ్గించే ఆహారాలివి!

అందంగా కనిపించేందుకు కొందరు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సౌందర్య ఉత్పత్తులు వాడటం, చికిత్సలు చేయించుకుంటారు. అయితే సహజ పద్ధతుల్లో అందాన్ని పెంపొందించుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు, అధికంగా చాక్లెట్లు తింటే చర్మంపై ముడతలు వస్తాయి. ఆయిల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల మొటిమలు ఏర్పడతాయి. పాస్తా, వైట్ బ్రెడ్, కేక్స్, ఉప్పు వంటివి మిత...

December 19, 2024 / 01:10 PM IST

జీలకర్ర నీటితో ఆరోగ్యానికి మేలు

1. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.2. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.3. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.4. అధిక బరువును కంట్రోల్ చేస్తుంది.5. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.6. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.7. అధిక బరువును నియంత్రిస్తుంది.

December 19, 2024 / 10:00 AM IST

జోగిపేట ఏరియా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

MDK: జోగిపేట ఏరియా ఆసుపత్రిలోని వైద్యులు బుధవారం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. మూడు రోజుల క్రితం కామారెడ్డికి చెందిన కుమ్మరి రాజు బైక్ నడుపుతూ అన్నాసాగర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి ఎడమ మోకాలి వద్ద ఎముక విరిగింది. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నాయక్ విరిగిన ఎముకను అతికించే శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశామని తెలిపారు. 

December 19, 2024 / 09:33 AM IST

జలుబుతో ముక్కు బ్లాక్ అయిందా?

శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. జలుబు చేసినప్పుడు ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కర్పూరంలో కాస్త కొబ్బరినూనె కలిపి వాసన చూడాలి. ఆరోమా ఆయిల్స్ లేదా విక్స్ బామ్ వేడినీటిలో వేసి ఆవిరి పట్టాలి. యూకలిప్టస్ ఆయిల్ కూడా ముక్కుదిబ్బడ సమస్యను తగ్గిస్తుంది. చిన్నపాటి శ్వాస సంబంధిత వ్యాయామాల...

December 19, 2024 / 07:36 AM IST

రేపు దివ్యాంగుల ఉచిత వైద్య శిబిరం

మెదక్ జిల్లా వైద్యశాలలో దివ్యాంగులకు ఈనెల 20వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 9 మంది అనుభవజ్ఞులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో వారికి చెప్పడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 19, 2024 / 04:29 AM IST