NZB: మోస్రా మండల కేంద్రానికి చెందిన శారదకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు.108 సిబ్బంది అంబులెన్సులో తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవించింది. అంబులెన్సు సిబ్బంది ప్రసవం చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. తల్లి బిడ్డలను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు టెక్నీషియన్ లలిత తెలిపారు.
నల్ల శనగలను ఉడకబెట్టి రోజుకూ కప్పు మోతాదులో తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ రూపంలో తింటే రాత్రి ఆహారం తక్కువగా తింటారు. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో శరీరానికి చేరే క్యాలరీల శాతం తగ్గుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి నల్ల శనగలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. షుగర్ ఉన్న వారికి ఇవి చక్కని ఆహారం అని ...
ఇటీవల కాలంలో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పని ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ముడతలని తగ్గించాలంటే పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ A, C, E, K.. మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూరను తినాలి. అవకాడో, పప్పుధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి.. మచ్...
కొందరు పిల్లలు సరిగా చదవరు. మరికొందరికి చదివింది సరిగా గుర్తుండదు. ఒత్తిడి, మానసిక అలసట దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే తులసి పొడిని స్మూతీస్ లేదా వేడి పాలలో కలిపి పిల్లల చేత తాగిస్తే ఏకాగ్రత పెరుగుతుందని సూచిస్తున్నారు. పెప్పర్ మింట్లు, మింట్ ఆయిల్, పుదీనా ఆకులు చదివింది మరచిపోకుండా ఉపయోగపడతాయట. రోజ్మేరీ ఆయిల్ సువాసన మానసిక అలసటను దూరం చేస్తుంది. అయితే దీన్ని మితంగా వాడాలి.
మెనోపాజ్ దశలో ఎదురయ్యే పలు అనారోగ్యాల్లో దంత సమస్య కూడా ఒకటి. అయితే మెనోపాజ్ దశకు చేరుకున్న 50 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని అధిగమించాలంటే కాల్షియం, డి-విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలి. రోజులో రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.
NLR: రాష్ట్రంలో క్షయ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా అడిషనల్ DMHO, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ జిల్లా సిబ్బందితో హాజరయ్యారు. క్షయ సర్వే ద్వారా బయటపడుతున్న కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిగింది.
నెల్లూరులో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడుకి జికా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దాంతో ఆ బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైరస్ నిర్ధారణ తర్వాత బాలుడిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
1. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.2. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.3. గ్యాస్, అసిటిడీ వంటి సమస్యలను దూరం చేస్తాయి.4. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తాయి.5. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.6. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.7. కండరాల నొప్పులు, పంటి సమస్యలు తగ్గుతాయి.8. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చలికాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే బొప్పాయి పండు తింటే మంచిది. పపాయను ఈ సీజన్లో తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు. పరిగడుపున దీన్ని తినడవ వల్ల సంపూర్ణ పోషణ అందుతుంది. మలబద్దకం, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం, దగ్గను ధరిచేరనీయదు.
ప్రతి రోజు ఉదయం చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. మరికొందరు పరిగడుపునే తాగేస్తుంటారు. అయితే కొన్ని రకాల టిఫిన్స్ తిన్న తరువాత వీటిని తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. పరాఠాలు తిన్న వెంటనే టీ, కాఫీ తాగవద్దు. ఇలా చేయడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. వైట్ బ్రెడ్, అరటి పండ్లు తిన్న వెంటనే వీటిని సేవిస్తే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
చలికాలం ఉసిరి తింటే సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉంటాం. అయితే షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవారు, లో బీపీ ఉన్నవారు, జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, డీ హైడ్రేషన్ సమస్యలు ఉన్నవారు ఉసిరి అధికంగా తీసుకోవద్దట. అలా చేయడం వల్ల బీపీ, షుగర్ లెవల్స్ మరింత తగ్గడం, మూత్ర విసర్జన అధికంగా జరిగి డీహైడ్రేషన్ భారీనపడటం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు అధికమవుతాయట.
చలికాలంలో పొడిగాలి కారణంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్ వ్యాప్తి చెంది గొంతు నొప్పి పెడుతుంది. గొంతులో గరగర, ఇతర ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. దీన్ని తగ్గించాలంటే.. వేడి టీలో కాసింత తేనె లేదా వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. లేకపోతే గోరువెచ్చని నీటిలో ఉప్పు లేదా బేకింగ్ సోడా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. రోజూ ఒకటి, రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమలాలి, ఆవిరి పీల్చుకోవాలి.
మతిమరుపు, పార్కిన్సన్స్ లాంటి నరాల వ్యాధులు వృద్ధాప్యంలో రాకుండా ఉండటానికి ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ ప్రియాంక సూచనలు చేశారు. ఏ వయసువారైనా బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఖాళీ కడుపుతో ఉండకూడదన్నారు. బ్రేక్ ఫాస్ట్ లేకుంటే రోగనిరోధక శక్తి తగ్గి, తలనొప్పి, ఇతర నరాల సమస్యలు వస్తాయన్నారు. నిద్రలేమి కారణంగా మెదడులో కణాలు క్రమంగా నశిస్తాయని, కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని, రోజూ అరగంటపాటు ఆగకుండా నడవాలని సూచించ...
1. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.2. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.3. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.4. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.5. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.6. మహిళలకు పీరియడ్ పెయిన్ నుంచి రిలీఫ్ కలిగిస్తుంది.7. శ్వాసకోశ సమస్యల నుంచి కాపాడుతుంది.
తీరిక లేదని కొంతమంది హడావిడిగా వేడివేడి టీ, కాఫీలు తాగటం.. ఫుడ్ తినటం వంటివి చేస్తుంటారు. ఇలా చేసేవారిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. అలా చేయటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారాలను తిన్నప్పుడు అన్నవాహికపై ప్రభావం పడి కాలుతుంది. అది కాస్తా ఇన్ఫ్లమేషన్కి దారి తీస్తుంది. దీర్ఘకాలం కొనసాగితే క్యాన్సర్కి కారణమవుతుందని పరశోధనలో తేలింది. కాబ్టటి పొగలు కక్కే ఆహారం, పానీయాల...