బ్రెడ్ మీద ఫ్రూట్ జామ్ రాసుకుని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మార్కెట్లో దొరికే చాలా జామ్లలో పండ్ల శాతం కంటే పంచదార, కృత్రిమ రంగులే ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటికి బదులుగా ప్రొటీన్ ఉండే పీనట్ బటర్ లేదా ఇంట్లో తాజాగా చేసుకున్న చట్నీలను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇయర్ బడ్లు, హెడ్ ఫోన్ల అతి వాడకం వల్ల ఇన్ఫెక్షన్లు, టిన్నిటస్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిని నివారించడానికి నిపుణులు 60:60 నియమాన్ని సూచిస్తున్నారు. అంటే 60 శాతం వాల్యూమ్ వద్ద, కేవలం 60 నిమిషాలు మాత్రమే వాడాలి. ఆ తర్వాత చెవులకు విశ్రాంతి ఇవ్వడం వల్ల వినికిడి శక్తిని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
చర్మం అందంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలి. ఇందుకోసం రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలు తప్పనిసరి. చక్కెర, ఉప్పు తగ్గించి.. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. అలాగే, ముఖానికి మర్దన చేయడం వల్ల చర్మ రంధ్రాల్లోని దుమ్ము, మురికి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
ఆహార నాణ్యత, పోషకాలను పర్యవేక్షించే కొత్త ఏఐ వ్యవస్థను ఉద్యోగ్ యంత్ర ఏఐ సంస్థ ప్రదర్శించింది. ఏఐ సెన్సర్లు, కెమెరాల ద్వారా వంటలో వాడే దినుసుల పరిమాణాన్ని, నాణ్యతను ఇది గణిస్తుంది. వంట పూర్తయ్యాక అందులోని క్యాలరీలు, విటమిన్ల వివరాలను తెరపై చూపిస్తుంది. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సంస్థ తెలిపింది.
నేటి కాలంలో స్మార్ట్ఫోన్ వాడకం వ్యసనమైంది. అతిగా ఫోన్ వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పొడిబారడం, చూపు మందగించడం జరుగుతుంది. సోషల్ మీడియా వాడకం వల్ల ఆందోళన, నిద్రలేమి వంటివి పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతారు. మెడ, వెన్నునొప్పి వస్తుంది. అందుకే డిజిటల్ డిటాక్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
చాలామంది ముఖంపై పెట్టే శ్రద్ధ కాళ్లు, చేతులపై పెట్టకపోవడంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారుతుంటాయి. ఈ సమస్యను నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. రోజుకు రెండుసార్లు అలోవెరా జెల్ రాస్తే నలుపు తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్, పంచదార మిశ్రమంతో స్క్రబ్ చేస్తే మృతకణాలు తొలగుతాయి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.
పిల్లలకు ORSL అనేది అస్సలు మంచిది కాదని.. డాక్టర్ శివరంజిని చెప్పారు. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని.. దీనివల్ల పిల్లల్లో వాంతులు, విరేచనాలు వస్తాయని చెబుతున్నారు. ORS ను తీసుకోండి.. కానీ ORSL అస్సలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు దీనిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనెను, మురికిని తొలగించడంలో రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఎండ వల్ల చర్మం కందిపోయినా లేదా ఎర్రగా మారినా కొద్దిగా రోజ్ వాటర్ చిలకరిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కానీ మొదటి సారి వాడేటప్పుడు చేతిపై కొద్దిగా రాసి ‘ప్యాచ్ టెస్ట్’ చేసుకోవడం ఉత్తమం.
కాఫీకి బదులుగా ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజంను పెంచి, క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండె జబ్బులు, స్ట్రోక్ ముప్పును నివారిస్తుంది. ఇందులోని కాటెచిన్స్ పళ్లు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మెదడును చురుకుగా ఉంచి ఏకాగ్రతను పెంచుతాయి. అయితే, రోజుకు 2 కప్పులు తాగాలి.
నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే సరిచేసుకోండి. ఎందుకంటే నిద్రలేమి మూలంగా ఆరోగ్యవంతులు రాత్రికి రాత్రే ముందస్తు మధుమేహం బారినపడే అవకాశమున్నట్లు అధ్యయనం హెచ్చరిస్తోంది. కాకపోతే మధుమేహంగా గుర్తించేంత స్థాయిలో ఉండవు. ఇది మున్ముందు పూర్తిస్థాయి మధుమేహంగా మారే ప్రమాదముంది.
కూర్మాసనం(తాబేలు భంగిమ) వెన్నెముకను బలోపేతం చేస్తూ వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నెముకను సాగదీయడం ద్వారా ఇది వీపు, భుజాలు, తుంటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ఉదర భాగంపై ఒత్తిడి తెచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. మెదడుకు, శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గించి విశ్రాంతి ఇస్తుంది.
శీతల పానీయాలు తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుందని అనుకోవడం పొరపాటని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలోని చక్కెర, కెఫిన్ వల్ల ఆమ్లత్వం మరింత పెరుగుతుంది. కడుపు ఉబ్బరం తగ్గాలంటే కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా చల్లని పాలు లేదా సోంపు గింజలు తీసుకుంటే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.
పైనున్న చిత్రం భాగ్యనగరపు నడిబొడ్డున వెలిసిన అందమైన దృశ్యంలా ఉంది. చారిత్రక చార్మినార్ రాత్రివేళ కాంతులతో మెరిసిపోతుంటే, దాని ముందు గాలిలో తేలుతున్న ఎర్రని బెలూన్లు ప్రేమానురాగాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ ఆ బెలున్లు పాతబస్తీ సంస్కృతికి ఆధునిక ప్రేమ సందేశాన్ని జోడించాయి. ఈ చిత్రం HYD ఆప్యాయతను, చారిత్రక సౌందర్యాన్ని ఒకే ఫ్రేమ్లో బంధించింది.
కుంకుమపువ్వు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక మూలకాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ కుంకుమపువ్వును నిత్యం పాలు, టీ రూపంలో తీసుకోవాలి. చర్మం నిగారింపునకు తోడ్పడుతుంది. రోజుకు 30mg కంటే ఎక్కువ తీసుకోవద్దు.
పాలు జంతు సంబంధిత ఆహారం కాబట్టి ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేసే కొవ్వులు ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్తో బాధపడేవారు పాలను మానేయడం సరికాదు. శరీర ఆరోగ్యాన్ని బట్టి పాలను ఎంచుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనుల్లో ఫలకాలు ఏర్పడేలా చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇరుకుగా చేసి గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.