1. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.2. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.3. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.4. అధిక బరువును కంట్రోల్ చేస్తుంది.5. డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది.6. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.7. అధిక బరువును నియంత్రిస్తుంది.
MDK: జోగిపేట ఏరియా ఆసుపత్రిలోని వైద్యులు బుధవారం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. మూడు రోజుల క్రితం కామారెడ్డికి చెందిన కుమ్మరి రాజు బైక్ నడుపుతూ అన్నాసాగర్ వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి ఎడమ మోకాలి వద్ద ఎముక విరిగింది. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నాయక్ విరిగిన ఎముకను అతికించే శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశామని తెలిపారు.
శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. జలుబు చేసినప్పుడు ముక్కు బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కర్పూరంలో కాస్త కొబ్బరినూనె కలిపి వాసన చూడాలి. ఆరోమా ఆయిల్స్ లేదా విక్స్ బామ్ వేడినీటిలో వేసి ఆవిరి పట్టాలి. యూకలిప్టస్ ఆయిల్ కూడా ముక్కుదిబ్బడ సమస్యను తగ్గిస్తుంది. చిన్నపాటి శ్వాస సంబంధిత వ్యాయామాల...
మెదక్ జిల్లా వైద్యశాలలో దివ్యాంగులకు ఈనెల 20వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 9 మంది అనుభవజ్ఞులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో వారికి చెప్పడం జరిగిందన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: మోస్రా మండల కేంద్రానికి చెందిన శారదకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు.108 సిబ్బంది అంబులెన్సులో తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవించింది. అంబులెన్సు సిబ్బంది ప్రసవం చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. తల్లి బిడ్డలను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు టెక్నీషియన్ లలిత తెలిపారు.
నల్ల శనగలను ఉడకబెట్టి రోజుకూ కప్పు మోతాదులో తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. సాయంత్రం స్నాక్స్ రూపంలో తింటే రాత్రి ఆహారం తక్కువగా తింటారు. కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో శరీరానికి చేరే క్యాలరీల శాతం తగ్గుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్న వారికి నల్ల శనగలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. షుగర్ ఉన్న వారికి ఇవి చక్కని ఆహారం అని ...
ఇటీవల కాలంలో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న పని ఒత్తిడి, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య ఎదురవుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ముడతలని తగ్గించాలంటే పోషకాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ A, C, E, K.. మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉండే పాలకూరను తినాలి. అవకాడో, పప్పుధాన్యాలని ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగి.. మచ్...
కొందరు పిల్లలు సరిగా చదవరు. మరికొందరికి చదివింది సరిగా గుర్తుండదు. ఒత్తిడి, మానసిక అలసట దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే తులసి పొడిని స్మూతీస్ లేదా వేడి పాలలో కలిపి పిల్లల చేత తాగిస్తే ఏకాగ్రత పెరుగుతుందని సూచిస్తున్నారు. పెప్పర్ మింట్లు, మింట్ ఆయిల్, పుదీనా ఆకులు చదివింది మరచిపోకుండా ఉపయోగపడతాయట. రోజ్మేరీ ఆయిల్ సువాసన మానసిక అలసటను దూరం చేస్తుంది. అయితే దీన్ని మితంగా వాడాలి.
మెనోపాజ్ దశలో ఎదురయ్యే పలు అనారోగ్యాల్లో దంత సమస్య కూడా ఒకటి. అయితే మెనోపాజ్ దశకు చేరుకున్న 50 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని అధిగమించాలంటే కాల్షియం, డి-విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడాలి. రోజులో రెండుసార్లు బ్రష్ చేయడం తప్పనిసరి. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి.
NLR: రాష్ట్రంలో క్షయ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా అడిషనల్ DMHO, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఖాదర్ వలీ జిల్లా సిబ్బందితో హాజరయ్యారు. క్షయ సర్వే ద్వారా బయటపడుతున్న కేసుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష జరిగింది.
నెల్లూరులో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడుకి జికా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దాంతో ఆ బాలుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైరస్ నిర్ధారణ తర్వాత బాలుడిని చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు.
1. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.2. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.3. గ్యాస్, అసిటిడీ వంటి సమస్యలను దూరం చేస్తాయి.4. కడుపు సంబంధిత సమస్యలను నివారిస్తాయి.5. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.6. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి.7. కండరాల నొప్పులు, పంటి సమస్యలు తగ్గుతాయి.8. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చలికాలం వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే బొప్పాయి పండు తింటే మంచిది. పపాయను ఈ సీజన్లో తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు. పరిగడుపున దీన్ని తినడవ వల్ల సంపూర్ణ పోషణ అందుతుంది. మలబద్దకం, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, జ్వరం, దగ్గను ధరిచేరనీయదు.
ప్రతి రోజు ఉదయం చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. మరికొందరు పరిగడుపునే తాగేస్తుంటారు. అయితే కొన్ని రకాల టిఫిన్స్ తిన్న తరువాత వీటిని తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. పరాఠాలు తిన్న వెంటనే టీ, కాఫీ తాగవద్దు. ఇలా చేయడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. వైట్ బ్రెడ్, అరటి పండ్లు తిన్న వెంటనే వీటిని సేవిస్తే షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు, జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
చలికాలం ఉసిరి తింటే సీజనల్ వ్యాధుల భారీన పడకుండా ఉంటాం. అయితే షుగర్ లెవల్స్ తక్కువ ఉన్నవారు, లో బీపీ ఉన్నవారు, జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, డీ హైడ్రేషన్ సమస్యలు ఉన్నవారు ఉసిరి అధికంగా తీసుకోవద్దట. అలా చేయడం వల్ల బీపీ, షుగర్ లెవల్స్ మరింత తగ్గడం, మూత్ర విసర్జన అధికంగా జరిగి డీహైడ్రేషన్ భారీనపడటం, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తడం వంటి సమస్యలు అధికమవుతాయట.