ఎండలో తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లగా ఉన్న నీరు తాగితే తాత్కాలికంగా రక్తనాళాలు ముడుచుకుపోతాయి. మైగ్రేన్, సైనస్ వంటి ఇబ్బందులు ఉన్నవారిపై ప్రభావం పడొచ్చు. కొందరిలో అకస్మాత్తుగా తలనొప్పి ఉత్పన్నం కావొచ్చు. ఒకవేళ చల్లటి నీటినే తాగాలనుకుంటే.. తొలుత సాధారణ నీటితో కాళ్లు, చేతులు, ముఖాన్ని కడుక్కోవాలి. 5-10 నిమిషాల తర్వాత చల్లటి నీటిని నెమ్మదిగా తాగాలి.