మరో 8:30గంటల్లో భారత్ 2026 ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. కానీ రిపబ్లిక్ ఆఫ్ కిరిటిబాటి ద్వీపం పరిధిలోని క్రిస్ట్మస్ ఐలాండ్ ఇప్పటికే 2026లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం అక్కడ 3:30pmకు NEW YEAR ప్రారంభమైంది. 7500 సగటు జనాభా ఉండే ఈ ద్వీప సమూహం ప్రపంచంలోని అత్యంత రిమోట్ ఐలాండ్స్లో ఒకటి. కాసేపట్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో న్యూ ఇయర్ మొదలవనుంది.
వాల్నట్స్లో ఒమేగా 3, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా మారడంతో పాటు మొటిమలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బరువు తగ్గుతారు. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది.
హనుమాసనం వేయడం వల్ల మీ కదలిక పరిధిని పెంచడానికి ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతర్గత అవయవాలను ఉత్తేజపరిచేందుకు, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది. కాళ్ల కండరాలను సాగదీయడం ద్వారా కాళ్ల తిమ్మిరిని నివారించడంలో సహాయపడుతుంది. కండరాలను సడలిస్తుంది. నిద్రలో వచ్చే కాళ్ల తిమ్మిరిని కూడా నివారిస్తుంది.
మనం తీసుకునే ఆహారంలో పెరుగు చాలా ముఖ్యమైనది. దీనిలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాంటి వారికి పెరుగు చాలా మంచిది. అంతేకాకుండా మలబద్ధకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి. కాగా, జలుబు, అలర్జీ ఉన్నవారు రాత్రిపూట పెరుగును తినవద్దు.
రేపటితో 2025కి ముగింపు పలకబోతున్నాం. ఈ ఏడాదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చాలా మంది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. అలాగే 2025 అనేది కొంత మందికి సంతోషాలను (గెలుపు) మిగిల్చితే.. మరికొంత మందికి కష్టాలను, దుఃఖాలను (ఓటమి) మిగిల్చింది. మరీ ఈ 2025 సంవత్సరంలో మీరు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మాతో పంచుకోండి.
ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వారిలో ఎక్కువగా కనిపించే సమస్య ఇది. క్రమరహిత పనివేళలు, సమావేశాలు, అధిక స్క్రీన్ వినియోగం, దీర్ఘకాలం పాటు సరైన భంగిమలో కూర్చోవడంలో పొరపాట్లు, అలాగే నిరంతర ఒత్తిడి లేదా బర్నౌట్కు దగ్గరైన భావన వంటి అనేక కారణాలు మైగ్రేన్కు కారణాలు. భారతదేశంలో దాదాపు 25 శాతం మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారని ది లాన్సెట్ నివేదిక పేర్కొంది.
✦ కదలకుండా కూర్చునే లేదా నడుంవాల్చి ఉండే జీవనశైలిని వదిలిపెట్టాలి✦ బరువులెత్తడం లేదా జిమ్ చేయాలి✦ అధిక కొవ్వు పదార్థాలను తగ్గించాలి✦ రోజూ 20 నిమిషాలు నడవాలి✦ రోజూ 8 గంటలు గాఢ నిద్రపోవాలి✦ జంక్, అతిగా శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని దూరం పెట్టాలి
✦ కళ్లు మూసుకుని శ్వాసపై దృష్టి పెట్టండి✦ ఏదైనా బుక్ తీసి కాసేపు ఏకాగ్రతతో చదవండి✦ లైట్స్ ఆఫ్ చేసి మనసుకు నచ్చిన ప్రశాంత దృశ్యాలను కళ్ల ముందు ఊహించుకోండి➤ ఇలా చేయడం ద్వారా క్రమంగా నిద్రలోకి జారుకుంటారు. అయితే పడుకునే ముందు టీ/కాఫీ తాగకండి. అలాగే కనీసం గంట ముందే ఫోన్ పక్కన పెట్టేయండి.
మనలో చాలా మందికి రోజంతా నిద్ర మత్తుగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం తగినంత నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం. ముఖ్యంగా విటమిన్ B12, D, రక్తహీనత లేదా అధిక ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుంది. అందుకే రోజూ తగినంత నీరు తాగుతూ.. సమయానికి పడుకుని, వ్యాయామం చేయడం ద్వారా దీనిని తగ్గించవచ్చు. సమస్య అధికంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
చలికాలంలో అనేకమందిని చెవి నొప్పి సమస్య వేధిస్తుంది. చలి తీవ్రత లేదా చల్లటి గాలులవల్ల ఇది సంభవిస్తుంది. దీంతోపాటు జలుబు, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే తరచుగా చలిగాలుల మధ్య పనిచేయాల్సి రావడం, బైక్పై చల్లగా జర్నీ చేయడం వల్ల కూడా చెవి నొప్పి, చెవిపోటు వంటివి వచ్చే చాన్స్ ఎక్కువ.
భుజంగాసనం (నాగుపాము భంగిమ) వెన్నెముకను బలపరుస్తుంది. ఛాతీ, భుజాలు, ఉదరభాగాలను సాగదీస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మెరుగైన శారీరక ఆరోగ్యం కోసం జీర్ణ అవయవాలను ప్రేరేపిస్తుంది. శ్వాసకోశ కండరాలను బలపరుస్తుంది. క్రమం తప్పకుండా సాధన చేస్తే ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది.
లిచీ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు అదుపులో ఉంటుంది. అయితే రోజుకు 5-7 లిచీ పండ్లకు మించి తింటే మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నేలపై కూర్చోవడం వల్ల వెన్నెముక సహజ స్థితిలో ఉంటుంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా కింద కూర్చోవడం వల్ల పొట్ట, వీపు కండరాలు బలోపేతమవుతాయి. వెన్నునొప్పి తగ్గుతుంది. కాళ్లు ముడుచుకుని కూర్చోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపడి మలబద్ధకం తగ్గుతుంది. మహిళలు నేలపై సరైన భంగిమలో కూర్చోవడం వల్ల పెల్విక్ కండరాలు బలపడతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
అధోముఖ స్వనాసనం శరీరాన్ని బలపరుస్తుంది, సాగదీస్తుంది. రక్త ప్రసరణను, శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, చేతులు, భుజాలు, కాళ్లు, హామ్ స్ట్రింగ్స్ వంటి కండరాలను బలోపేతం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడుకు రక్త సరఫరాను పెంచుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ ఆసనం చేయకూడదు.
వర్క్కు టైం అవుతోంది.. ఇప్పుడు తినడం కుదరదని ఆహారాన్ని స్కిప్ చేస్తున్నారా?. మీరెంత బిజీగా ఉన్నా.. సమయానికి భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తినకుండా ఎక్కువ సేపు ఉంటే మీ రక్తంలో చక్కెర తగ్గుతుంది. దీంతో మీ శరీరం కార్టిసాల్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. దీని వల్ల ఒత్తిడి, కోపం పెరుగుతాయి.